ఎట్టకేలకు సినీ ప్రియులకు శుభవార్త వెలువడింది. అన్ లాక్ 5.0లో భాగంగా థియేటర్లు, మల్టిప్లెక్స్ లు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన విషయం తెల్సిందే. అక్టోబర్ 15 నుండి దేశవ్యాప్తంగా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు 50 శాతం ఆక్యుపెన్సీతో ప్రారంభం కానున్నాయి.
ఇక థియేటర్లు తెరుచుకుంటుండడంతో అందరి ఫోకస్ సినిమా రిలీజ్ లపై పడింది. ముఖ్యంగా టాలీవుడ్ లో మొదట విడుదలయ్యే సినిమా ఏది అంటూ చర్చ నడుస్తోంది. అయితే వెంటనే పెద్ద సినిమాలు విడుదలయ్యే పరిస్థితి లేదు. కరోనా వైరస్ ఇంకా తగ్గలేదు. ఆరు నెలల నుండి థియేటర్లకు వెళ్లడం లేని జనాలు మళ్ళీ ఎంతవరకూ వస్తారన్నది డౌటే.
ఇదిలా ఉంటే టాలీవుడ్ లో లాక్ డౌన్ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా రిలీజ్ అంటే రెడ్ అన్న సమాధానమే వినిపిస్తోంది. రామ్, మాళవిక శర్మ హీరో, హీరోయిన్లుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా కారణంగా కుదర్లేదు. తమిళంలో సూపర్ హిట్ అయిన తడం సినిమా రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. కిషోర్ తిరుమల దర్శకుడు. ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయమని ఆఫర్లు వచ్చినా కూడా రామ్ ససేమీరా అనడంతో థియేటర్లలోనే చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రెడ్ చిత్రం విడుదల ఎప్పుడనేది త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
661909 432620Would love to perpetually get updated fantastic weblog ! . 457325
254211 663647Extremely nicely written story. It will be valuable to anyone who usess it, including yours truly . Maintain up the very good function – canr wait to read far more posts. 978390