రాష్ట్రంలో అర్చకులు, వేద పండితుల జీవితాలు గాలిపటాల్లా తయారయ్యాయని స్వరూపానందేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారికి వేతనాలు 15 వేలకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అయితే.. దేవాదాయ శాఖలోని కొందరు అధికారులు అడ్డుపడుతున్నారని, వారి అలసత్వమే ఇందుకు కారణమని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రహ్మయజ్ఞ స్మార్త సభకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణుల కులవృత్తిగా గుర్తించాలన్నారు.
పురోహితుల హితమే పీఠం కోరుకుంటోందని అన్నారు. అనుకోనిది జరిగితే వారి కుటుంబాలను ఎలా ఆదుకోవాలో పీఠం ఆలోచిస్తోందన్నారు. వేద పండితుల జీవనభృతి పెంచేందుకు, అర్చకుల వంశపారంపర్య హక్కులు సాధించడానికి కూడా పీఠం కృషి చేసిందన్నారు. వచ్చే ఏడాది విశాఖలో అర్చకులు, పురోహితులు, వేద పండితులతో భారీ సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు.
ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ… ఎవరు ఏ కార్యక్రమం తలపెట్టినా పురోహితులు లేకుండా పని ప్రారంభం కాదన్నారు. బ్రాహ్మణులు ధర్మాన్ని పరిరక్షిస్తారని, హైందవ జాతిని జాగృతం చేస్తున్నారని ఆయన అన్నారు.
442315 735081Some truly nice stuff on this web site, I adore it. 953496
103924 913789Some genuinely excellent blog posts on this internet website , regards for contribution. 580866
44395 960457Dead pent subject matter, thanks for entropy. 427122