Switch to English

వైసీపీ నేతలతో సుజనా మంతనాల వెనుక ‘మతలబు’ ఏంటి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, ప్రస్తుతం బీజేపీలో వున్నారు. సుజనా చౌదరిని తీసుకొచ్చే క్రమంలో ఆయనకు కీలకమైన ‘బాధ్యతల్ని’ బీజేపీ పెద్దలు అప్పగించారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ‘టీడీపీని దెబ్బకొట్టాల్సిన పనిలేదు.. ఎందుకంటే, ఆ పార్టీ పనైపోయింది. వైసీపీ విషయంలోనే స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాలి..’ అంటూ బీజేపీ పెద్దలు సుజనాకి అప్పట్లో ‘అస్సైన్‌మెంట్‌’ ఖరారు చేశారంటూ రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంటుంది. మరి, సుజనా ఆ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించేస్తున్నారా.? పార్క్‌ హయాత్‌ హోటల్‌లో అసలేం జరిగింది.? ఇప్పుడు ఈ అంశం చుట్టూ రాజకీయ వర్గాల్లో రకరకాల గుసగుసలు విన్పిస్తున్నాయి.

వైసీపీ లీక్‌ చేసిన ఓ వీడియోలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, పార్క్‌ హయాత్‌ హోటల్‌లో సుజనా చౌదరితో భేటీ అయినట్లు కన్పిస్తోంది. అయితే, ఇక్కడ బయటకు రావాల్సిన ‘కథ’ చాలానే వుందంటున్నారు. వైసీపీ చెందిన 30 మందికి పైగా ప్రజా ప్రతినిథులు పార్క్‌ హయాత్‌ హోటల్‌లోనే సుజనా చౌదరితో భేటీ అయ్యారన్నది ఆ రోజే తెరపైకొచ్చిన ఓ సంచలన గాసిప్‌. ‘అబ్బే, అలాంటిదేమీ లేదు..’ అని కొందరు వైసీపీ నేతలు ఆ గుసగుసల్ని కొట్టి పారేసినా.. తాజాగా ఆ గాసిప్స్‌ మరింత జోరందుకుంటున్నాయి. ‘పలువురు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు సుజనా చౌదరితో టచ్‌లోకి వెళ్ళారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో సుజనా చౌదరి పెద్ద ఆపరేషన్‌కి శ్రీకారం చుట్టారు..’ అన్నది రాజకీయ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తున్న హాటెస్ట్‌ గాసిప్‌. కాగా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ‘పార్క్‌ హయాత్‌ హోటల్‌కి సంబంధించి మరిన్ని వివరాలు అతి త్వరలో..’ అని ఆ మధ్య ట్వీటేశారుగానీ, ఆ తర్వాత ఆ విషయాన్ని లైట్‌ తీసుకున్నారు.

‘వీడియో ఫుటేజ్‌లో వైసీపీ నేతల బాగోతం బయటపడింది.. అందుకే వైఎస్సార్సీపీ ఇప్పుడు కుక్కిన పేనులా వుండిపోయింది..’ అంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు గుప్పుమంటున్నాయి. ఈ టీడీపీ అనుకూల మీడియాకి ఎంతో కొంత దన్ను బీజేపీ రూపంలో కూడా వుండడంతో, పార్క్‌ హయాత్‌ హోటల్‌లో నడిచిన, నడుస్తున్న రాజకీయంపై ఉత్కంఠ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇదే సమయంలో బీజేపీ జాతీయ స్థాయి నేతలు, రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై విమర్శల దాడి షురూ చేయడంతో.. ఏదో జరుగుతోందన్న అనుమానాలైతే మరింత బలపడుతున్నాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...