తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టేందుకు బీజేపీ, జనసేన పార్టీలు పావులు కదుపుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెక్ పెడితే ఆ ప్లేస్ లో జనసేన, బీజేపీలు ఎంటర్ కావొచ్చు. ఎలాగో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. పైగా తెలుగుదేశం పార్టీలో చరిష్మా కలిగిన నేతలు కరువయ్యారు. ఇప్పుడు వైకాపాపై కూడా ప్రజల్లో వ్యతిరేకత రావడం మొదలైంది. ఈ సమయంలో రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ పార్టీ కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
దీనిని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని బీజేపీ, జనసేన చూస్తున్నాయి. ఇద్దరు కలిసి ఉంటె 2024 వరకు బలం పెంచుకోవచ్చు అన్నది వీరి ఆలోచన. ఈ ఆలోచనతోనే రాష్ట్రంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దానికి మొదటి అడుగుగా ఈరోజు మీటింగ్ జరగబోతున్నది. త్వరలోనే జరగబోతున్న స్థానిక ఎన్నికల్లో ఎలా కలిసి పనిచేయాలి. ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయంపై చర్చించబోతున్నారు.
వీటితో పాటుగా అమరావతి అంశంలో ఈ రెండు పార్టీలు కలిసి రైతులకు ఎలా మద్దతుగా పోరాటం చేయాలి అనేది కూడా చర్చించబోతున్నారు. 2024 ఎన్నికల వరకు కలిసి పనిచేయాల్సిన విషయాలపై రెండు పార్టీలు చర్చిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుంటారని అనుకున్నారు. కానీ, జనసేన వెళ్లి బీజేపీతో కలవడంతో టీడీపీ షాక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ పక్కన ఉంటె కొంతబలం ఉన్నట్టే అని భావించింది. అందుకోసమే నవంబర్ 3 వ తేదీన విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ కు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఆ ఎత్తులు బెడిసికొట్టడంతో తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలను ఎదుర్కోవడానికి ఎలాంటి ఎత్తులు వేస్తుందో చూడాలి.
775442 963571hello I was extremely impressed with the setup you used with this website. I use blogs my self so very good job. definatly adding to bookmarks. 158325
816196 193191Someone necessarily assist to make critically articles Id state. This really is the very first time I frequented your web page and thus far? I amazed with the analysis you produced to make this actual submit incredible. Superb activity! 653879