వైసీపీ నేత రవిచంద్రా రెడ్డి, ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో జనసేన వీర మహిళ, జనసేన పార్టీ అధికార ప్రతినిథి కీర్తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమైంది.
పూర్తిగా సంయమనం కోల్పోయి, అడ్డగోలుగా మాట్లాడటంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా. సబ్జెక్ట్ జీరో.. దాంతో, ఇతరుల వ్యక్తిగత జీవితాలపై అడ్డగోలు వాదనలు చేసేసి.. చర్చా కార్యక్రమాల సమయాన్ని మొత్తం తినేస్తుంటారన్న విమర్శ వుంది. ఈ విషయంలో రవిచంద్రారెడ్డి తక్కువేం కాదు.
కానీ, ఈసారి ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పలేదు. జనసేన అధికార ప్రతినిథి కీర్తన, పోలీసులను ఆశ్రయించారు.. తనను రవిచంద్రారెడ్డి అవమానించడంపై. కీర్తన మేకప్, కీర్తన చీరకట్టు.. ఇలా అత్యంత అసభ్యకరంగా మాట్లాడారు రవిచంద్రారెడ్డి. ‘చీర మహిళలు’ అని కూడా అన్నారాయన. పవన్ కళ్యాణ్ని ఇంప్రెస్ చేస్తే, సినిమాల్లో హీరోయిన్గా ఛాన్సులొస్తాయనీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు రవిచంద్రారెడ్డి.
ఈ వ్యాఖ్యలపై కీర్తన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మరోపక్క, కీర్తనకు జనసేన అధినాయకత్వం బాసటగా నిలిచింది. న్యాయపోరాటం చేయాల్సిందిగా అధినాయకత్వం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలో, ఆమె పోలీసుల్ని ఆశ్రయించారు. మరోపక్క, కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధమయ్యారు.
అయితే, రవిచంద్రారెడ్డి వ్యాఖ్యల్ని ఆయన ఇంట్లోని మహిళలు కూడా సమర్థించలేదు. తప్పు పట్టారు, తప్పు తెలుసుకోమని హితబోధ చేశారు. ‘నా భార్య కూడా నా మాటల్ని సమర్థించలేదు..’ అని స్వయంగా రవిచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. బేషరతు క్షమాపణ కీర్తనగారికి చెబుతున్నా.. అంటూ ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో కీర్తన సమక్షంలోనే చెప్పుకొచ్చారు. అవసరమైతే, ఏ ఛానల్లో మాట జారానో అదే ఛానల్లోనూ క్షమాపణ చెబుతానన్నారాయన.
రవిచంద్రారెడ్డి ఒక్కరే కాదు, చాలామంది వైసీపీ నేతల ఇళ్ళల్లోనూ.. వారి అభ్యంతరకర వ్యాఖ్యల్ని సమర్థించే పరిస్థితి లేదు. మారుతున్నాయ్.. అన్నీ మారుతున్నాయ్.! జనసేన వీరమహిళలా మజాకానా.?