ఒక రోజు కాదు, రెండ్రోజులు కాదు.. ఏకంగా నాలుగు రోజులు లాకప్లో వున్నారట ‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు. దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా రామోజీరావు గురించి చెబుతుంటారు.
ప్రియా పచ్చళ్ళు.. మార్గదర్శి ఛిట్ఫండ్ సంస్థ.. రామోజీ ఫిలిం సిటీ.. వీటన్నిటికీ మించి, ఈనాడు.. వీటన్నిటికీ అధినేత రామోజీరావు. కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా, రామోజీరావుని ప్రత్యేకంగా గౌరవిస్తుంటారు.
తెలుగుదేశం పార్టీకి అయితే రామోజీరావు ఏకంగా ‘రాజగురువు’ అని చెప్పొచ్చు. అలాంటి రామోజీరావుని, నాలుగు రోజులపాటు పోలీసులు లాకప్లో వుంచడం సాధ్యమయ్యే పనేనా.? ఔను, సాధ్యమే.. పైగా, అది జరిగిందని అంటున్నారు మాజీ ఎంపీ వుండవల్లి అరుణ్ కుమార్.
ప్రసాద్ అనే వ్యక్తి వుండవల్లి అరుణ్ కుమార్తో ఈ విషయం చెప్పారట. దానికి సంబంధించిన ఆధారాలు తన వద్దకు వచ్చాక, పూర్తి వివరాలు వెల్లడిస్తానంటున్నారు వుండవల్లి. ‘మార్గదర్శి’ కంటే ముందు, అనధికారికంగా నిర్వహించిన చిట్టీల వ్యవహారం నేపథ్యంలో అబిడ్స్ పోలీసులు, రామోజీరావుని అదుపులోకి తీసుకుని నాలుగు రోజులపాటు లాకప్లో వుంచారామోరట.
ఈ విషయం అప్పారావు అనే వ్యక్తికి కూడా తెలుసంటున్నారు వుండవల్లి. అప్పారావు అంటే, రామోజీరావు తోడల్లుడు అనుకోవచ్చా.? రామోజీరావు తోడల్లుడు అప్పారావుని డాల్ఫిన్ అప్పారావు అని పిలుస్తుంటారు. ఇంతకీ, నిజమేంటి.? సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియో కథేంటి.?