Ramoji Rao: ‘ఇదీ సంగతి’ అట.! అందులో నరేంద్ర మోడీ మీద కార్టూన్ వేశారట.! ‘ఈనాడు’ పత్రిక అనగానే ముందుగా అందులో కనిపించే ‘శ్రీధర్ కార్టూన్’ గురించే ఎక్కువ మంది చూస్తారు. కానీ, అది ఒకప్పటి వ్యవహారం. శ్రీధర్ కార్టూన్లకు కాలం చెల్లింది. ఆయన ‘ఈనాడు’ని వదిలేశారెప్పుడో.!
ఎవరెవరో కార్టూన్లు వేస్తున్నారు. కానీ, అవేవీ ఈ మధ్య పేలడంలేదు.! ఇప్పుడేమో మరీ పేలవంగా తయారైంది ‘ఇదీ సంగతి’ కార్టూన్ పరిస్థితి. ‘దేహీ..’ అంటూ దేబిరిస్తునట్లుగా మారింది వ్యవహారం.
అసలు విషయమేంటంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఓ పులి మీదకెక్కి సవారీ చేస్తున్నారు. అవినీతి మీద దండెత్తుతున్నారు. ఆ పులికి నల్లధనంరాయళ్ళను చూపిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీ ‘వీరత్వాన్ని’ చాటి చెప్పడం ఈ ‘ఇదీ సంగతి’ కార్టూన్ తాలూకు అంతరార్థం.
ఏమయ్యింది రామోజీరావుకి.? ఏంటి సంగతి.? ఇదొక కార్టూన్ అనుకోవాలా.? మోడీని పొగిడేందుకు కార్టూన్ ఎందుకు.? ఓ పెద్ద ఎడిటోరియల్ రాసేస్తే పోలా.? ఏమో, ఆ ముచ్చటనీ చూడబోతున్నామేమో.!
లేకపోతే, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి ఒనగూడిన లాభమేమీ లేదు.. నష్టం తప్ప.! ఔను, పెద్ద నోట్ల రద్దుతో దేశం చాలా ఇబ్బందులు పడింది. అప్పట్లో వెయ్యి రూపాయల నోటు తీసేసి, రెండు వేల రూపాయల నోటు తీసుకొచ్చారు. ఆ రెండు వేల రూపాయల నోటు ఇప్పుడు తీసేస్తున్నారు.
లాభ నష్టాల బేరీజు వేసి, కేంద్ర ప్రభుత్వాన్నీ, ప్రధాని నరేంద్ర మోడీనీ కడిగి పారెయ్యకుండా.. ఈ నమో.. జపం ఏంటి.? మార్గదర్శి కేసులో తనను బయటపడేస్తారని ఇలా మోడీకి రామోజీ భజన చేస్తున్నారని అనుకోవాలా.? అంతేనేమో.!