కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్. అనూహ్య నిర్ణయాలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన స్పీకర్ రమేష్ కుమార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుపై తిరుగుబాటు చేసి ప్రభుత్వ పతనానికి కారణమైన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్.. తాజాగా కాంగ్రెస్ కు చెందిన 11 మంది, జేడీఎస్ కు చెందిన ముగ్గురిపై అనర్హత వేటు వేశారు. దీంతో ఇప్పటివరకు వేటు పడిన ఎమ్మెల్యేల సంఖ్య 17కి చేరింది. స్పీకర్ నిర్ణయం వెంటనే అమల్లోకి రావడంతో వారంతా వచ్చే ఎన్నికల వరకు పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. రెబెల్ ఎమ్మెల్యేల కారణంగా కుమారస్వామి సర్కారు కూలిపోయిన సంగతి తెలిసిందే. వారంతా విశ్వాస పరీక్ష రోజున సభకు గైర్హాజరు కావడంతో సభలో మేజిక్ ఫిగర్ 103కి తగ్గింది. దీంతో 105 మంది సభ్యులు కలిగిన బీజేపీ విశ్వాస పరీక్ష వీగిపోయేలా చేయడంలో సఫలీకృతమైంది.
అనంతరం కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్ యడియూరప్ప.. సోమవారం కర్ణాటక విధాన సభలో తన బలం నిరూపించుకోనున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ రమేష్ కుమార్ రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా హాజరుకావాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. రెబెల్స్ పై వేటు వేసినప్పటికీ బీజేపీ సర్కారుకు ఎలాంటి ఢోకా లేదు. 17 మంది సభ్యులపై అనర్హత వేటు వేయడంతో సభలో సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. నామినేటెడ్ ఎమ్మెల్యేని మినహాయిస్తే మేజిక్ ఫిగర్ 104కి చేరింది.
బీజేపీకి ప్రస్తుతం 105 మంది సభ్యుల మద్దతు ఉండగా.. ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కూడా మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షలో బీజేపీ సునాయాసంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు స్పీకర్ రమేష్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని బీజేపీ యోచిస్తోంది. ఆయన తనంతట తానుగా రాజీనామా చేయకపోతే తాము అవిశ్వాసం ప్రవేశపెడతామని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు.
367029 689445Hmm is anyone else experiencing troubles with the images on this blog loading? Im trying to find out if its a problem on my end or if its the blog. Any responses would be greatly appreciated. 341604
517775 709741Thanks for helping out, superb info . 44751