Switch to English

రఘురామకి డబుల్ ఝలక్: అయినా తగ్గేదే లే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

‘ఎప్పుడైతే సాక్షి మీడియాలో వార్త వచ్చిందో, అప్పుడే నాకు సీబీఐ కోర్టు నుంచి వచ్చే తీర్పు పట్ల పెద్దగా ఆతృత లేకుండా పోయింది.. నమ్మకం కూడా పోయింది.. న్యాయస్థానాల నుంచి వచ్చే తీర్పులపై మాట్లాడేందుకు కొన్ని పరిమితులు వున్నాయి కాబట్టి.. అంతకు మించి మాట్లాడలేం..’ అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు కోరుతూ రఘురామ, సీబీఐ కోర్టును కొన్నాళ్ళ క్రితం ఆశ్రయించిన విషయం విదితమే. కేసు విచారణ సందర్భంగా సీబీఐ చేతులెత్తేసింది. ‘కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోండి..’ అని సీబీఐ, కోర్టుకి తెలిపింది. అప్పుడే ఈ కేసు విషయమై రఘురామ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

కాగా, విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం, తీర్పు వెల్లడిపై కొంత గ్యాప్ తీసుకోవడం, ఇంతలోనే సాక్షి మీడియా, ‘రఘురామ పిటిషన్ కొట్టివేత.. జగన్, విజయసాయి బెయిల్ రద్దు విషయంలో రఘురామకి షాక్..’ అంటూ ప్రచారం చేసిందో.. ఆ తర్వాత రఘురామ అలర్ట్ అయ్యారు.

సీబీఐ కోర్టు తీర్పు వెలువరించకుండా చూడాలనీ, కేసు విచారణను మరో బెంచ్‌కి బదిలీ చేయాలని కోరుతూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, రఘురామకి హైకోర్టులో ఆశించిన శుభవార్త అందలేదు. రఘురామ పిటిషన్‌ని హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో, సీబీఐ కోర్టు.. తీర్పు వెల్లడించడానికి మార్గం సుగమం అయ్యింది. జగన్ సహా విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు ఊహించినదేననీ, తాను ఈ విషయమై హైకోర్టును ఆశ్రయిస్తానని రఘురామ ఓ చానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఒకవేళ హైకోర్టులో కూడా తీర్పు తనకు అనుకూలంగా రాని పక్షంలో సుప్రీంకోర్టు తలుపు తడతానని రఘురామ చెప్పడం కొసమెరుపు. రాజకీయంగా తనను వేధింపులకు గురిచేయడం, బెయిల్ షరతుల్ని ఉల్లంఘించడం.. ఇన్ని చేస్తున్నా.. ఈ వివరాలు న్యాయ వ్యవస్థ ముందుంచినా, జగన్ అలాగే విజయసాయిరెడ్డి బెయిల్ ఎందుకు రద్దవలేదో తనకు అర్థం కావడంలేదని అంటున్నారు రఘురామ.

తగ్గేదే లే.. సుప్రీంకోర్టుకైనా వెళతానని రఘురామ అంటున్నారు సరే.. అక్కడైనా రఘురామ కోరుకున్న ‘న్యాయం’ జరుగుతుందా.? అన్నది కాలమే నిర్ణయించాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...