సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరు ఏళ్ల అమ్మాయిపై అత్యాచారంకు పాల్పడ్డ వ్యక్తి ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నామని.. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. నింధితుడికి కఠిన శిక్ష పడాలంటూ కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్న విషయం తెల్సిందే. అయితే నింధితుడు ఇంకా పట్టుబడకుండానే కేటీఆర్ పట్టుబడ్డాడు అంటూ పోలీసులు పట్టుకున్నారు అంటూ ట్వీట్ చేశారు. దాంతో గందరగోళం ఏర్పడింది. ఈ విషయమై కేటీఆర్ మరో ట్వీట్ ను చేసి తన గత ట్వీట్ ను వెనక్కు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.
నింధితుడు ఇంకా పట్టుబడలేదు. హైదరాబాద్ పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అతి త్వరలోనే అతడు పట్టుబడుతాడు అనే నమ్మకంతో ఉన్నాను. ఖచ్చితంగా అతడికి తగిన శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అంటూ ఈ సందర్బంగా కేటీఆర్ పేర్కొన్నాడు. తనకు తప్పుడు సమాచారం రావడం వల్ల అతడు అరెస్ట్ అయినట్లుగా పేర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కేటీఆర్ ట్వీట్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటారు సార్ మీరు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మంత్రి వర్గంలో ముఖ్యుడు, కాబోయే ముఖ్యమంత్రి కే తప్పుడు సమాచారం ఉంటే ఇంక రాష్ట్రం పరిస్థితి ఏమిటి? సామాన్య ప్రజల రక్షణ సంగతి ఏమిటి? దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంలో ముక్కుపచ్చలారని ఆరేళ్ళ గిరిజన బాలిక హత్యాచారానికి బలై సుమారు ఆరు రోజులు అవుతున్నా నిందితుడు ఆచూకీ దొరకలేదు, పట్టుకుంటే ఇనాం ఇస్తాం అనే వ్యవస్తలతో ఆ చిన్నారికి న్యాయం జరుగుతుందా?
746869 468621Woh I like your posts , saved to fav! . 985771