Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu). క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే.. ఇటివల అప్డేట్స్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు వచ్చాయి. దీనిపై చిత్ర నిర్మాత ఇటివలే ఏ.ఎం.రత్నం చెక్ పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో పవర్ స్టార్ అభిమానుల్లో జోష్ నిండింది. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..
‘పవన్ కల్యాణ్ తో సినిమా తీసి డబ్బులు సంపాదించాలంటే ఓ 20 రోజులు కాల్షీట్స్ తీసుకుని ఏదొక సినిమా తీసేవాడ్ని. కానీ.. ఆయనతో సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి. జాతీయస్థాయిలో ఆయన పేరు వినిపించాలి. నేను తెరకెక్కిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. సినిమా ఆగిపోయిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అవేమీ నమ్మొద్దు. సినిమా ఆగిపోలేదు. హరిహర వీరమల్లుకు సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. ఈ సినిమాతో పవన్ మరో స్థాయికి వెళ్తార’ని అన్నారు.