సాధారణ రోజుల్లో ఓ సాధారణ జ్వరానికే ఐదు లక్షలు వసూలు చేసే ఘన చరిత్ర కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులకుంది. ఏమిటీ అన్యాయం.? అని ఎవరన్నా ప్రశ్నిస్తే, ‘ఫైవ్ స్టార్ హోటల్ తరహా సౌకర్యాలు..’ అనే సమాధానం అటువైపు నుంచి వస్తుంది. అత్యాధునిక వైద్యం పేరుతో, రోగుల్ని నిలువునా దోచేయడంలో మాస్టర్ డిగ్రీ చేసేశాయి కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు. చిన్నపాటి అనారోగ్య సమస్యలకి సర్జరీలు చేసేసి, ప్రజల జీవితాల్ని అల్లకల్లోలం చేసేయడంలో సదరు కార్పొరేట్ ఆసుపత్రుల పైశాచికత్వం అంతా ఇంతా కాదు. ఇన్సూరెన్స్ వుంటే చాలు, ఆ దోపిడీకి ఆకాశమే హద్దు. ఇన్స్యూరెన్స్ లేకపోయినా డబ్బు చెల్లించే స్తోమత వుంటే, చిన్నపాటి జ్వరం కూడా.. క్యాన్సర్ని మించి భయపెడ్తుంది. ఆరోగ్యశ్రీని సైతం ప్రైవేటు ఆసుపత్రులు ఎడా పెడా ‘ఉపయోగించేసుకుంటాయి’ తమ జేబుల్ని నింపుకోడానికీ, ప్రజారోగ్యాన్ని కొల్లగొట్టడానికి. అలాంటిది, కరోనా వైరస్ని తేలిగ్గా వదిలేస్తాయా.?
తెలంగాణ ప్రభుత్వం, కరోనా వైద్య చికిత్స కోసం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణ కేసులు, ఎమర్జన్సీ కేసుల్ని ఎలా డీల్ చేయాలి.? ఎంత వసూలు చేయాలి.? అన్నదానిపై ఓ జీవో విడుదల చేసింది. కానీ, అందులో పేర్కొన్న ధరలకు భిన్నంగా వైద్యం అందుతోంది ప్రైవేటు ఆసుపత్రుల్లో. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులైతే, ప్రభుత్వమ్మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి, ‘కొందరికి మాత్రమే ప్రభుత్వం సూచించిన ధరలు’ అనే వెసులుబాటు తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో చాలామంది బాధితులు ప్రైవేటు ఆసుపత్రుల్లో నిలువు దోపిడీకి గురవుతున్నారు.
కరోనాతో తన కుటుంబంలో ముగ్గుర్ని కోల్పోయిన ఓ బాధితుడు, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని కళ్ళకు కట్టినట్లు వివరించాడు. మొత్తం 40 లక్షలు కరోనా వైద్య చికిత్స కోసం వెచ్చించాల్సి వచ్చిందంటూ తన ఆవేదనను మంత్రి కేటీఆర్కి ట్విట్టర్ ద్వారా వెల్లగక్కాడు. ‘జరిగిన ఘోరానికి చింతిస్తున్నాను..’ అంటూ హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ లైట్ తీసుకున్నారు కేటీఆర్.
ఇదొక్కటే కాదు, ఇలాంటి దారుణాలు తెలంగాణలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. 15 లక్షలు బిల్లు చెల్లించిన ఓ కుటుంబం, కరోనా నుంచి బయటపడలేదు సరికదా, కుటుంబ సభ్యుడ్ని కోల్పోతే, ఆ కుటుంబ సభ్యుడి మృతదేహాన్ని ఇచ్చేందుకు ఓ ప్రముఖ ఆసుపత్రి నిరాకరిస్తూ 9 లక్షలు చెల్లించాలని బ్లాక్మెయిల్ చేసిన ఘటన అందర్నీ కలచివేస్తోంది. చూస్తోంటే, సదరు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకుల్ని ‘శవాల్ని పీక్కుతినే రాబందులు’ అనడం సబబేమో.
ఇది ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో కరోనాని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినా, అక్కడా ఈ తరహా ఘటనలే వెలుగు చూస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వాలకు నియంత్రణ లేకపోవడంతోనే ఈ దుస్థితి అన్నది నిర్వివాదాంశం. దురదృష్టవశాత్తూ చాలా ప్రైవేటు ఆసుపత్రులకు రాజకీయ నాయకుల అండదండలుంటున్నాయి.
19911 547316Spot on with this write-up, I really suppose this website needs much much more consideration. probably be once more to learn way far more, thanks for that info. 568584
576913 176734You must indulge in a contest for among the greatest blogs more than the internet. Ill suggest this web internet site! 96296
984892 832495Black Ops Zombies […]some people nonetheless have not played this game. Its hard to imagine or believe, but yes, some individuals are missing out on all with the fun.[…] 580352
903821 520772Some truly wondrous function on behalf with the owner of this website, perfectly fantastic subject material . 552622
893123 977465I consider something truly fascinating about your website so I saved to fav. 83862