Switch to English

స్పెషల్ స్టోరీ: కరోనా కల్లోలంతో పత్రికా సిబ్బందికి ఎంత కష్టం.. ఎంత కష్టం?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారితో అన్ని రంగాలవారూ ఇబ్బంది పడుతున్నా.. పత్రికా సిబ్బంది పాట్లు మాత్రం ఎవరికీ ఉండవు. ప్రభుత్వానికి, ప్రజలకు నడుమ వారధిలో ఉండే పాత్రికేయులు వృత్తి ధర్మంలో భాగంగా కరోనా కల్లోలంలోనూ ప్రాణాలకు తెగించి పనిచేయక తప్పలేదు. ఇంత చేసినా వారికి రావాల్సిన గుర్తింపు కొంచెం కూడా లేదు. కరోనా యోధులుగా వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల గురించే ప్రస్తావిస్తారు తప్ప.. వారితో సమానంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పాత్రికేయులు ఎవరికీ పట్టరు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది పత్రికా సిబ్బంది కరోనా బారిన పడగా.. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. సహచరులు ఈ మహమ్మారి బారిన పడుతున్న దృశ్యాలను ప్రత్యక్షంగా చూస్తున్నా.. ఏదో ఒక సమయంలో తమకూ ఆ పరిస్థితి తప్పదని తెలిసినా.. కార్యక్షేత్రంలో ముందుకెళ్లడం తప్ప చేసేదేమీ లేదని వారికి తెలుసు. ఎందుకంటే ఆ కొలువుంటేనే నోట్లోకి నాలుగు వేళ్లు కాకపోయినా కనీసం రెండు వేళ్లయినా వెళతాయనే కఠోర సత్యం కళ్ల ముందు కదలాడుతుంది కాబట్టి. ఇప్పటికే కరోనా కారణంగా దాదాపు అన్ని సంస్థలూ వేతనాల్లో కోతేశాయి. పలు సంస్థలు చాలామందిని తొలగించాయి.

ఒక్క ఈనాడులోనే ఎడిటోరియల్ సిబ్బంది మినహా యాడ్స్, సర్క్యులేషన్, మార్కెటింగ్, సెక్యూరిటీ సహా పలు విభాగాల్లో దాదాపు 400 మందిని తొలగించినట్టు సమాచారం. ఎడిటోరియల్ విభాగానికి వస్తే రిటైర్ అయిపోయి ఎక్స్ టెన్షన్ మీద కొనసాగుతున్నవారిని సాగనంపేశారు. మిగిలినవారి విషయంలో లేఆఫ్ ప్రకటించి.. కార్యాలయానికి ఎన్నిరోజులు రావాలో నిర్దేశించి, ఆ మేరకే వేతనాలు ఇస్తున్నారు. ఇది కూడా ఎంతకాలం కొనసాగుతుందనేది తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు తమను వద్దని చెప్పేస్తారో అని పలువురు ఆందోళన చెందుతున్నారు.

సాక్షిలో ప్రస్తుతానికి వేతనాల కోత, ఉద్యోగుల తొలగింపు లేకపోయినా.. త్వరలోనే దాదాపు 30 శాతం సిబ్బందిని కుదించే అవకాశం ఉందనే ప్రచారం చాలామందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే, ప్రస్తుతానికి అలాంటిది ఏమీ జరిగే అవకాశం లేదని పలువురు అంటున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలోనే కరోనా కబళించే అవకాశమున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో పలు ప్రతికల్లోని సిబ్బంది భయంభయంగానే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.

క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా ఉంటే.. ఆయా సంస్థల యాజమాన్యాల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు పాత్రికేయులను మరింత కుంగదీస్తున్నాయి. కేవలం వార్తా సేకరణకే పరిమితమైన రిపోర్టర్లకు యాడ్ టార్గెట్స్ ఇవ్వడమే కాకుండా వాటిని తెచ్చినవారికే వేతనాలు లేదా డేట్ లైన్ లు ఇస్తామనే వేధింపులు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.

నిజానికి ఇలా యాడ్స్ తేవాలనే టార్గెట్ చిన్నపత్రికలకే ఉండేది. కానీ గత కొంతకాలంగా పెద్ద పత్రికలకూ వ్యాపించింది. వార్షికోత్సవానికి యాడ్స్ తీసుకురావాలని స్టాఫర్లకు కూడా టార్గెట్ విధించడం సాధారణమైపోయింది. ఎడ్వర్టైజింగ్ విభాగం చేయాల్సిన పనిని రిపోర్టర్లకు అప్పగించడం.. విధి లేని పరిస్థితుల్లో వారు చేయాల్సి రావడం ఎప్పటినుంచో జరుగుతోంది.

తాజాగా దీనికి సంబంధించి ఓ పత్రికలో పనిచేసే రిపోర్టర్ సోషల్ మీడియా సాక్షిగా తన ఆవేదన వ్యక్తంచేశారు. తమ యాజమాన్యం కరోనా కల్లోలంలోనూ యాడ్స్ టార్గెట్ ఇవ్వడం.. వాటిని తెచ్చినవారికే డేట్ లైన్ కొనసాగిస్తామని హెచ్చరించడం.. అలాగే జిల్లా బ్యూరో చీఫ్ కూడా టార్గెట్ ఇవ్వడం.. అందుకోసం ఆయన నానా పాట్లు పడీ ఎలా పూర్తిచేశారో అన్నీ వివరించారు.

అయితే, అంతటితో వదిలిపెట్టకుండా వార్షికోత్సవం యాడ్స్ తీసుకురావాలని మళ్లీ టార్గెట్ పెట్టడం.. ఇందుకోసం బెదిరింపులు, హెచ్చరికలు ఎలా సాగాయో పూసగుచ్చినట్టు తెలిపారు. ఈ క్రమంలో ఆ బ్యూరో చీఫ్ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క పత్రికే కాదు.. దాదాపు అన్ని పత్రికల్లోనూ ఇదే ఒరవడి కొనసాగుతోంది.

ఒకప్పుడు కేవలం చిన్న పత్రికలకే పరిమితమైన ఈ పద్దతి.. క్రమంగా ప్రధాన పత్రికలకూ పాకడమే విడ్డూరం. ఇప్పటికే రిపోర్టర్లపై స్టోరీల గురించి ఒత్తిడి ఉండగా.. తాజాగా కొన్ని పత్రికలు ఫొటోగ్రాఫర్లకు కూడా మంగళం పాడేసి, ఆ బాధ్యతలను కొన్నిసార్లు వారికే అప్పగిస్తున్నాయి. ఇది ఇలా కొనసాగుతున్న తరుణంలో యాడ్స్ టార్గెట్లు అదనం. ఇక పాత్రికేయుల పరిస్థితి ఇలా ఉంటే యాడ్ విభాగంలో పనిచేసేవారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.

సాధారణ సమయంలోనే యాడ్స్ కోసం వారు తిరుగుతూ ఉండాలి. కరోనా సమయంలో ఇది అంత సులభమైన టాస్క్ కాదు. పైగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో యాడ్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఈ నేపథ్యంలో వారిపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా వీరి ఉద్యోగాలు కూడా సంస్థలు తొలగించాయి. పది మంది చేసే పనిని ఇద్దరు ముగ్గురికే అప్పగించింది. మామూలు పరిస్థితుల్లో అయితే ఎలాగోలా చేయొచ్చు.. కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఈ ఒత్తిడిని వారు తట్టుకోలేకపోతున్నారు.

ఈ సందర్భంలో శ్రీశ్రీ చెప్పిన మాటలు గుర్తుకురాక మానవు. ‘కూటి కోసం ఆత్మతృప్తి కోసం.. పాత్రికేయుడిగా బతుకుదామని.. పత్రికలో చేరిన రిపోర్టర్ కి ఎంత కష్టం ఎంత కష్టం.. యాడ్స్ కోసం దిగులుపడుతూ దీనుడౌతూ వీధి వీధి తిరగడం ఎంత కష్టం ఎంత కష్టం.. అసలు పని పక్కకొదిలి కొసరు పనికి పాకులాడే నేటి పాత్రికేయుడికి ఎంత కష్టం ఎంత కష్టం?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...