శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనలో 9 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. డ్యామ్ చరిత్రలోనే దీన్ని అతి పెద్ద ప్రమాదంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మరోపక్క, అప్పుడే ఈ ప్రమాదంపై రాజకీయాలు షురూ అయ్యాయి.
డ్యామ్ లో ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద ప్రమాదం జరగడంపై అనుమానాలున్నాయనీ, కుట్ర కోణాన్ని కొట్టి పారేయలేమనీ, సీబీఐతో విచారణ చేయించి, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. మరోపక్క, ఈ ప్రమాదంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో కొందరు అధికారులు ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్సేపటి క్రితం ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించడం గమనార్హం. ఇదిలా వుంటే, రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం పట్ల సోషల్ మీడియాలో ఎడా పెడా సెటైర్లు పడుతున్నాయి. ఓటుకు నోటు కేసులో ఎందుకు సీబీఐ విచారణకు డిమాండ్ చేయలేదు.? అంటూ గులాబీ శ్రేణులు రేవంత్రెడ్డిపై విరుచుకుపడుతుండడం గమనార్హం. రాజకీయాల్ని పక్కన పెడితే, జరిగిన ప్రమాదం చిన్నదేమీ కాదు. సీబీఐ విచారణ జరగాలన్న డిమాండ్ సబబైనదేనన్న వాదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పవర్ జనరేషన్ యూనిట్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ప్రమాదం జరిగిన వెంటనే, మంటల్ని అదుపు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. కొందరు సిబ్బంది మంటల్ని అదుపు చేయలేక, ఆ ప్రాంతంనుంచి బయటపడగా.. కొందరు మాత్రం అందులోనే చిక్కుకుపోయారు. సుమారు 12 మంది లోపలే చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. వీరిలో 9 మంది చనిపోయినట్లు కాస్సేపటి క్రితమే అధికారులు వెల్లడించారు.
శ్రీశైలం తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీటిని అందించడమే కాదు, జల విద్యుత్ని కూడా అందిస్తోన్న విషయం విదితమే. శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి భద్రతపై కొంతకాలంగా అనుమానాలు వెల్లువెత్తుతున్నా.. ‘ఆల్ ఈజ్ వెల్’ అంటూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి.
620787 693991Interesting post. Ill be sticking around to hear significantly far more from you guys. Thanks! 120713
422197 350624Quite interesting subject , thanks for posting . 235359