Switch to English

శ్రీశైలం ప్రమాదం: సీబీఐ విచారణకు రెడ్డిగారి డిమాండ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి జల విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనలో 9 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. డ్యామ్ చరిత్రలోనే దీన్ని అతి పెద్ద ప్రమాదంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మరోపక్క, అప్పుడే ఈ ప్రమాదంపై రాజకీయాలు షురూ అయ్యాయి.

డ్యామ్ లో ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద ప్రమాదం జరగడంపై అనుమానాలున్నాయనీ, కుట్ర కోణాన్ని కొట్టి పారేయలేమనీ, సీబీఐతో విచారణ చేయించి, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మరోపక్క, ఈ ప్రమాదంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో కొందరు అధికారులు ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాస్సేపటి క్రితం ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించడం గమనార్హం. ఇదిలా వుంటే, రేవంత్‌ రెడ్డి సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయడం పట్ల సోషల్‌ మీడియాలో ఎడా పెడా సెటైర్లు పడుతున్నాయి. ఓటుకు నోటు కేసులో ఎందుకు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయలేదు.? అంటూ గులాబీ శ్రేణులు రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడుతుండడం గమనార్హం. రాజకీయాల్ని పక్కన పెడితే, జరిగిన ప్రమాదం చిన్నదేమీ కాదు. సీబీఐ విచారణ జరగాలన్న డిమాండ్‌ సబబైనదేనన్న వాదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పవర్‌ జనరేషన్‌ యూనిట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ప్రమాదం జరిగిన వెంటనే, మంటల్ని అదుపు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. కొందరు సిబ్బంది మంటల్ని అదుపు చేయలేక, ఆ ప్రాంతంనుంచి బయటపడగా.. కొందరు మాత్రం అందులోనే చిక్కుకుపోయారు. సుమారు 12 మంది లోపలే చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. వీరిలో 9 మంది చనిపోయినట్లు కాస్సేపటి క్రితమే అధికారులు వెల్లడించారు.

శ్రీశైలం తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీటిని అందించడమే కాదు, జల విద్యుత్‌ని కూడా అందిస్తోన్న విషయం విదితమే. శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి భద్రతపై కొంతకాలంగా అనుమానాలు వెల్లువెత్తుతున్నా.. ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అంటూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...