మన డార్లింగ్ అలియాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అందుకే తన ప్రతి సినిమా రెండు మూడు భాషల్లో చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘జాన్’ సినిమా రెగ్యులర్ షూట్ ని ప్రారంభించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇది 2020 సమ్మర్ లో రిలీజ్ కానుంది.
ఇటీవలే వచ్చిన ‘సైరా’తో బడ్జెట్ నే కాదు పీరియాడికల్, గ్రాఫిక్స్ కంటెంట్ ని కూడా డీల్ చేయగలనని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం అందరి చూపు ఈయన తదుపరి సినిమా ఎవరితో ఉంటుందా అనే దానిమీదే ఉంది. గత కొద్దీ రోజులుగా సురేందర్ రెడ్డి తదుపరి సినిమా నితిన్ తో ఉంటుందని అన్నారు. కానీ నితిన్ మాత్రం వరుసగా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.
మాకు తెలిసిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం, సురేందర్ రెడ్డి తన తదుపరి సినిమా కూడా భారీ బడ్జెట్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే పాన్ ఇండియన్ స్టార్ అయిన ప్రభాస్ తో సినిమాలని ట్రై చేస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ కి లైన్ చెప్పే అవకాశం ఉందని. అది నచ్చితే ఫుల్ స్క్రిప్ట్ మీద కూర్చుంటారట.
ప్రభాస్ కూడా జాన్ తర్వాత మరోమూవీ కమిట్ అవ్వలేదు. సో వీరిద్దరి కలయికలో సినిమా ఓకే అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువే కనిపిస్తోంది. వీరిద్దరి కలయిక సెట్ అయితే ఆ సినిమా 2020 సమ్మర్లో సెట్స్ పైకి వెళ్తుందట. మరి ఈ క్రీజీ ప్రాజెక్ట్ జరగాలని ఆశిద్దాం.
173723 130557You appear to be extremely professional inside the way you write.::~ 54370
122343 720559Properly worded post will probably be sharing this with my readers this evening 867340
672619 901327When visiting blogs, i usually discover a very very good content like yours 693714