కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కారణంగా కొన్ని కొన్ని నిత్యావసర పనులు జరుగుతున్నప్పటికీ చాలా మాధ్యమాల పనులు ఆగిపోయాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రజలకి వినోదాన్ని పంచే సినిమా రంగం. షరతులతో షూటింగ్స్ కి పర్మిషన్ వచ్చినా ఇప్పుడప్పుడే షూటింగ్స్ మొదలు కాని పరిస్థితి నెలకొంది. పెద్ద హీరోల సినిమాలన్నీ ఇప్పుడప్పుడే మొదలయ్యేలా కనిపించడం లేదు.
కానీ పెద్ద హీరోల కొత్త సినిమాల కాంబినేషన్స్ మాత్రం సెట్ అవుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రాధే శ్యామ్ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయ్యాక ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయనున్నాడని ఇది వరకే తెలిపాం. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది అజయ్ దేవగణ్ ‘తన్హాజీ’ తో హిట్ అందుకున్న ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ చేయనున్నారట.
ఇందులో ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ పాత్రలు ఎలా ఉంటాయి? ఏ జానర్లో కథ ఉంటుంది అనేది సమాచారం లేదు. కానీ ఈ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు మాత్రం మొదలైపోయాయి. ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయినా రెండు సినిమాలు ఫినిష్ చేశాకే ఓమ్ రౌత్ మూవీ చేస్తాడు.
106983 5954Merely wanna state that this is really beneficial , Thanks for taking your time to write this. 522161