పీఎం కేర్స్ నిధులతో పలు రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసిన వెంటిలేటర్లు నాణ్యత లేనివని వస్తున్న ఆరోపణలపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. దేశంలో కోవిడ్ పరిస్థితులపై శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో వెంటిలేటర్ల అంశం చర్చకు వచ్చింది. దీనిపై స్పందిస్తూ వెంటనే ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సరిగా పని చేస్తున్న వెంటిలేటర్లపై అవసరమైతే ఆరోగ్య కార్యకర్తలకు కొత్తగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
అలాగే.. కంటైన్మెంట్ జోన్ల గురించి చర్చించారు. కరోనా రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టెస్టులు పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ నిల్వల్లో కొరత లేకుండా చూడాలన్నారు. ఇటివల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ట్వీట్ చేస్తూ కేంద్రం పంపించిన వెంటిలేటర్లపై కేంద్ర ఆరోగ్య శాఖ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో వెంటిలేటర్ల నాణ్యతపై విమర్శలు వచ్చాయి.
123850 760425Pretty section of content material. I just stumbled upon your weblog and in accession capital to assert that I get truly enjoyed account your blog posts. Any way I will probably be subscribing to your augment and even I achievement you access consistently speedily. 757943