తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పథకాన్ని హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సీఎం కేసీఆర్ భావించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిల్ దాఖలైంది. జనవాహిని, జైస్వరాజ్, తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. ఇందుకు గల కారణాలను పొందుపరుస్తూ పిల్ దాఖలు చేశాయి.
ఇటీవల హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ పధకాన్ని హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టారు ఆ పార్టీ నేతలు. ఈ నిర్ణయం సరికాదని పిల్ దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని.. లబ్ది పొందేందుకే తెలంగాణ ప్రభుత్వం హుజూరాబాద్ లో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
ఇప్పటికే ఇదే అంశంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ పిల్ లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఈసీ, తెలంగాణ ప్రభుత్వాన్ని పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు.
74355 682026stays on topic and states valid points. Thank you. 218971
955453 978325You produced some decent points there. I looked online to the problem and discovered many people is going in addition to employing your website. 21638
821252 417538Some genuinely excellent info , Gladiola I observed this. 296354
542931 766365you use a amazing weblog here! do you need to make some invite posts on my weblog? 837173