లాక్డౌన్ ఎత్తి వేసిన తర్వాత మళ్లీ పెట్రోలు ధరలు ప్రతి రోజు మార్చుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఆయిల్ సంస్థలకు ఇచ్చిన విషయం తెల్సిందే. దాంతో గత 15 రోజులుగా వరుసగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 15 రోజుల్లో పెట్రోల్ ధర ఏకంగా 8 రూపాయలు పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలే ఆందోళనకరంగా ఉంటే ఇలా పెరుగుతూ పోతే పరిస్థితి ఏంటీ అంటూ మద్యతరగతి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు భారీగా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. అసలు కరోనా కష్టకాలంలో జీతాలు రాక అరకొర జీతాలతో కుటుంబాలను సాగిస్తున్న వారు ఇప్పుడు పెట్రోలు డీజిల్ ధరలు పెరగడంతో ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కుంటున్నారు. ధరలు ఇంకా ఎన్ని రోజులు ఇలా పెరుగుతాయి, ఎంత కాలం ఈ పెరిగిన రేట్లను భరించాలో అర్థం కావడం లేదు. పెట్రోల్ ధర రాబోయే అయిదు సంవత్సరాల్లో వందకు చేరుతుందని అనుకున్నారు. కాని అంతకు ముందే చేరుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
—
152709 961878I dont feel Ive read anything like this before. So great to find somebody with some original thoughts on this topic. thank for starting this up. This site is something that is required on the web, someone with a bit originality. Great job for bringing something new to the internet! 102712
62026 889330If I must say something, then absolutely nothing will stop the chatter within 977119