కేరళ తిరుపూర్ తారాపురం సమీపంలో రైతులు సాగు చేస్తున్న పంట పొలాలను పక్కన అడివి నుండి వచ్చే నెమలుల తీవ్రంగా నష్టపర్చుతూ వస్తున్నాయి. రైతులు నెమలుల వల్ల ప్రతి ఏటా లక్షల పంట నష్టపోతున్నారు. దాంతో విసుగు చెందిన ఒక రైతు తాజాగా ఆ నెమలులకు మందు పెట్టి చంపేయడం స్థానికంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
పోలీసులు మరియు స్థానికుల కథనం ప్రకారం కూరగాయల తోట వేసిన రైతు తన పంటను కాపాడుకునేందుకు నెమలులకు మందు పెట్టాడు. ఒకటి రెండు వస్తాయనుకున్న అతడే షాక్ అయ్యేలా ఏకంగా 11 నెమలులు మృతి చెందాయి. దాంతో అటవి శాఖ అధికారులు రైతుపై కేసు పెట్టారు. అతడిని అరెస్ట్ చేశారు. తాను ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కూడా స్పందించక పోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో రైతులుకు స్థానిక రైతులు మద్దతు తెలపడం కొసమెరుపు.
125188 914551Hmm, I never thought about it that way. I do see your point but I believe numerous will disagree 870150
172389 857393Stay up the great work! 864524