ఊసరవెల్లి సినిమాలో నటించిన పాయల్ ఘోష్ తన కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్న విషయం తెల్సిందే. ఆమె ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ పై దారుణమైన కామెంట్స్ ను చేసింది. ఆ దర్శకుడు తనను రేప్ చేయడానికి ప్రయత్నించడంటూ ఏకంగా ప్రధానమంత్రి మోదీకే ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇవే ఆరోపణలపై ఆమె మహారాష్ట్ర గవర్నర్ ను కూడా కలిసింది. 2013 ఆగస్ట్ లో ముంబైలో అనురాగ్ స్వస్థలంలో తన రేప్ ప్రయత్నం జరిగిందని పాయల్ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఈ విషయంపై పలువురు రాజకీయ నాయకులు పాయల్ కు సపోర్ట్ చేస్తున్నారు.
ఈ కేసులో పోలీసులు రంగప్రవేశం చేసి నిన్న అనురాగ్ ను దాదాపు 8 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో అనురాగ్ కశ్యప్ సమర్పించిన ఆధారాలు చూసి పోలీసులు నివ్వెరపోయారు. పాయల్ ఆరోపిస్తున్నట్లుగా ఏం జరగలేదని, నిజానికి తాను 2013లో ఆగస్ట్ నెలంతా శ్రీలంకలోనే ఉన్నానని, ఒక సినిమా విషయమై తాను శ్రీలంక వెళ్లినట్లు చెప్పాడు దర్శకుడు.
దీనికి సంబంధించిన ఫ్లయిట్ టికెట్లు, రెస్టారెంట్ బిల్లులు, బార్ బిల్లులు పక్కాగా సమర్పించాడు అనురాగ్. ఇంతటితో ఆగిపోకుండా తన ప్రతిష్టకు భంగం కలిగించిన పాయల్ పై రివర్స్ కేసు నమోదు చేయనున్నట్లు తెలిపాడు.
897860 854836Some genuinely rattling function on behalf of the owner of this site , utterly wonderful content material . 762403
985625 395880What a lovely weblog page. I will surely be back once more. Please maintain writing! 651624