ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్రైవేటు పాఠశాలలు భారీగా ఫీజులు వసూలు చేయడంపై సినీ నటుడు శివ బాలాజీ గళమెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేయడం కూడా తెలిసిన విషయమే. కరోనా, లాక్ డౌన్ సమయంలో ప్రైవేట్ పాఠశాలలు ఈ విధంగా దోపీడీకి పాల్పడటం సరికాదన్నారు. ప్రజలు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పాఠశాల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. శివ బాలాజీ భార్య మధుమిత కూడా ఈ దోపిడీపై ధ్వజమెత్తారు.
శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో ఆయన మట్లాడారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన తల్లిదండ్రుల నుంచి పాఠశాల యాజమాన్యం ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇది దారుణమైన విషయం. ఫీజులు కట్టకపోతే ఆన్ లైన్ క్లాసుల నుంచి ఐడీ తొలగిస్తున్నారు. మెయిల్స్, మెసేజెస్ పంపిస్తూ ఒత్తిడి చేస్తున్నారు. మౌంట్ లిటేరా స్కూలు ఇదే చేస్తోంది. మిగిలిన స్కూల్స్ కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలు సిండికేట్ అయ్యాయి. విద్యార్ధుల తల్లిదండ్రులు అందరూ ఈ పద్ధతిని వ్యతిరేకించాలి’ అన్నారు.
శివ బాలాజీ భార్య నటి మధుమిత మాట్లాడుతూ.. ‘ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం చెప్తోంది. కానీ.. స్కూలు యాజమాన్యాలు ఇతర ఫీజులతో తల్లిదండ్రులను వేధిస్తున్నారు. 35 శాతం ఫీజులు చెల్లించినా.. ఇంకా ఫీజు కట్టనివ్వడం లేదని పరీక్షలు రాయనివ్వటం లేదు. తమలాంటి పిల్లల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరించాలి’ అని ఆమె కోరారు.
1639 859803You made some decent factors there. I looked on the internet for the problem and discovered most individuals will go along with together with your web site. 376817
288578 243808An intriguing discussion is worth comment. Im positive which you merely write regarding this subject, might possibly not be considered a taboo subject but typically persons are too little to communicate on such topics. To one more. Cheers 477164