పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తోన్న దీక్ష దసరాకు పూర్తవుతుంది. వెంటనే పవన్ వకీల్ సాబ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఈ చిత్రం కోసం దాదాపు 20 రోజులను కేటాయించాడు పవన్. ఈ సినిమా షూటింగ్ ను నవంబర్ చివరికి పూర్తి చేయాలన్నది ప్లాన్. ఇక వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ ఒక రీమేక్ సినిమాను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ మొదటినుండి మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోశియుమ్ పై ఆసక్తి చూపిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా రీమేక్ హక్కులను సంపాదించింది. జనవరి నుండి ఈ సినిమా పట్టాలెక్కుతుందన్నది ఒక వార్త.
రీసెంట్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ విషయంలో స్పందించడం కూడా ఆసక్తి రేపుతోంది. రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు వారి 10వ సినిమా అప్డేట్ వస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు అదే అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ అని తెలుస్తోంది. రేపు సాయంత్రం ఈ చిత్ర టైటిల్ అండ్ లోగోను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో పవన్, రానా కలిసి నటించబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే రేపటి వరకూ ఆగక తప్పదు.
After long hiatus, we all are slowly going back to work. And we have decided it is time for new beginnings as well.
We will be announcing our Next Production No. 10 details tomorrow along with Title & Logo at 04:05pm!! Stay tuned!😉@vamsi84 pic.twitter.com/L1QM50V3dO
— Sithara Entertainments (@SitharaEnts) October 8, 2020
786512 283911Giving you the most effective News is really considerably imptortant to us. 531843
219911 452797Yeah bookmaking this wasnt a risky decision outstanding post! . 814525