పవన్ కళ్యాణ్ మండపేటలో పర్యటించిన సమయంలో అక్కడి రైతులతో మాట్లాడతారు. రైతుల సమస్యలపై స్పందించారు. రైతుల వద్ద నుంచి ధాన్యం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి డబ్బు చెల్లించలేదు. డబ్బు చెల్లించకపోగా అసలు ఈ విషయం గురించి పట్టించుకోకుండా ఉండటంతో పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని పవన్ ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు.
ఒకవైపు గిట్టుబాటు ధరలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించకుండా సైలెంట్ గా ఉండటంతో రైతులకు ఏం చేయాలో తెలియడం లేదు. ఇదే విషయాన్ని మండపేట వచ్చిన పవన్ కళ్యాణ్ ముందు రైతులు ప్రస్తావించారు. రైతుల విషయంపై ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేలోపుగా స్పందించాలని, లేదంటే తాను దీక్ష చేస్తానని పవన్ చెప్పిన మాట తెలిసిందే కదా.
అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం… అసెంబ్లీ సమావేశాల్లో వీటిగురించి మాట్లాడాలి, ప్రతి పక్షాలను ఎలా ఎదుర్కోవాలి అనే వాటిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. కనీసం రైతుల గురించి పట్టించుకోవడం లేదు. కౌలు రైతుల విషయంలో కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పవన్ దీక్ష చేసేందుకు సిద్ధం అయ్యారు.
ఈనెల 12 వ తేదీన కాకినాడలో భారీ దీక్ష చేయబోతున్నారు. ఉదయం 8 గంటలకు ఈ దీక్ష ప్రారంభం కాబోతున్నది. అయితే, ఈ దీక్షకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందా లేదా అన్నది తెలియాలి. ఒకవేళ అనుమతి ఇవ్వకపోయినా పవన్ దీక్ష చేసి తీరతాడు. కాబట్టి బందోబస్తు ఇవ్వక తప్పదు. ప్రభుత్వం, పోలీసులు బందోబస్తు ఇచ్చింది అంటే పవన్ కొంతమేర సక్సెస్ అయ్యినట్టే. ఈ దీక్షకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందా లేదా అన్నది చూడాలి.
606845 494665I like this weblog so much, saved to my bookmarks . 894898
222110 271205Remarkable blog layout here. Was it hard creating a nice searching website like this? 575822