వివి వినాయక్ కు మాస్ డైరెక్టర్ గా మంచి పేరుంది. కెరీర్ లో తర్వాత్తర్వాత కామెడీ వైపు వచ్చేసాడు కానీ వినాయక్ కెరీర్ మొదట్లో అన్నీ యాక్షన్ ప్రధానమైన సినిమాలు, రివెంజ్ బేస్డ్ మూవీస్ తీసేవాడు. నందమూరి బాలకృష్ణతో తీసిన చెన్నకేశవ రెడ్డి అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందని ఈ ఏడాది మొదట్లో వార్తలు వచ్చాయి.
వినాయక్, బాలయ్యతో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నించాడు. సాయి ధరమ్ తేజ్ తో చేసిన తేజ్ ఐ లవ్ యూ డిజాస్టర్ గా నిలవడంతో కొంత బ్రేక్ తీసుకున్న వినాయక్, బాలయ్యకు కొన్ని కథలు వినిపించాడు. అయితే బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ : కథానాయకుడు, మహానాయకుడు సినిమాల దెబ్బతో ఏ సినిమా ఒప్పుకోవాలన్న కన్ఫ్యూజన్ లో వినాయక్ సినిమాను పక్కనపెట్టి రూలర్ ను పట్టాలెక్కించాడు.
కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ తెరకెక్కగా దానికి సి కళ్యాణ్ నిర్మాత. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం పూర్తైన వెంటనే బోయపాటి శ్రీనుతో పట్టాలెక్కించేసాడు బాలకృష్ణ. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. మరోవైపు వినాయక్ కూడా దర్శకత్వ ప్రయత్నాలను పక్కనపెట్టి హీరోగా శీనయ్య సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలుకానుంది. ఇలా ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా మారడంతో ఇక వినాయక్ – బాలయ్య కాంబోలో సినిమా ఉండదనే అనుకున్నారు అంతా.
అయితే ఇటీవలే సి కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుందని, తానే నిర్మిస్తానని చెప్పడం విశేషం. చెన్నకేశవ రెడ్డి కంటే పవర్ఫుల్ స్క్రిప్ట్ కోసం వినాయక్ కష్టపడుతున్నాడని, వచ్చే ఏడాది కచ్చితంగా ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుందని చెప్పడం విశేషం. అంతే కాకుండా ఇప్పటికే బాలకృష్ణ హీరోగా మూడు సినిమాలను నిర్మించిన సి కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు.
498217 533296A truly fascinating read, I may nicely not agree totally, but you do make some quite legitimate factors. 27595
774541 239457I always was concerned in this topic and stock nonetheless am, regards for posting . 325480