జనసేనాని పవన్ కల్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీలోని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ నేతలతో విజయవాడలో సమావేశమయ్యారు. జనసేన- బీజేపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఏపీలోని పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. మీటింగ్లో జనసేన తరఫున పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరు కాగా బీజేపీ తరఫున ఆ పార్టీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్, దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలనా పరంగా ఎలాంటి ప్రణాళికలు లేకుండా అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న అంశంపై చర్చించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపైన చర్చించుకున్నట్లు సమాచారం. కాగా త్వరలో విస్తృత స్థాయిలో మరోసారి సమన్వయ సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా పవన్ నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లానాయక్’ ఫస్ట్ గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
41976 61940Youre so cool! I dont suppose Ive learn anything like this before. So good to locate any person with some authentic thoughts on this topic. realy thank you for starting this up. this internet site is something that is wanted on the internet, someone with just a little bit originality. valuable job for bringing something new towards the web! 495632
901010 26165great day, your internet web site is cheap. I do a lot of thanks for succeed 439081