Pawan Kalyan: జనసేన (Janasena) పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు. చేబ్రోలులో పవన్ నివాసం ఉండే నాలుగు అంతస్థుల ఇంటిని కన్నులపండుగగా అలంకరించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు.
వేడుకల అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘పిఠాపురం నుంచే వచ్చే ఎన్నికల్లో విజయకేతనం ఎగుర వేస్తున్నాం. క్రోధి నామ సంవత్సరంలో కొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. ప్రజలకు మేలు జరగాలి. రైతులు బాగుండాలి. ఉద్యోగులు జీతాలు మొదటి తారీఖునే రావాలి. ప్రజలంతా బాగుండాలి. మహిళలకు మరిన్ని ప్రోత్సాహాలు లభించాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఇవన్నీ తప్పకుండా జరుగుతా’యని అన్నారు.
స్థానికులకు అందుబాటులో ఉండేందుకు ఈ ఇంటిలో పవన్ ఉండబోతున్నారు. పవన్ తోపాటు ఈ వేడుకల్లో నాగబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు, పిఠాపురం.#Pithapuram#PawanKalyanForPithapuram pic.twitter.com/CgtCO96bs1
— JanaSena Pithapuram (@pithapuramjsp) April 9, 2024