Switch to English

తెలంగాణపై ఫోకస్‌ పెడుతున్న జనసేనాని.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై పూర్తి ఫోకస్‌ పెట్టిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికల విషయంలో మాత్రం ‘మమ’ అనిపించేశారు. హైద్రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి జనసేనాని ఓ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెల్సిందే. అయినప్పటికీ తెలంగాణలో జనసేన నేతలు అంత యాక్టివ్‌గా కనిపించడంలేదు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ వంటి పార్టీలే తెలంగాణలో గట్టిగా గళం విప్పడానికి జంకుతున్న ఈ పరిస్థితుల్లో జనసేనాని, తెలంగాణపై ఫోకస్‌ పెట్టాలనే నిర్ణయానికి రావడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అచేతనావస్థలోకి వెళ్ళిపోయింది. అయితే, జనసేన మాత్రం ధైర్యంగా నిలబడింది. జనసేన అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రజానీకంలోనూ జనసేన ధైర్యం పట్ల పాజిటివ్‌ స్పందన కనిపించింది. విజయావకాశాల గురించి ఆలోచించకుండా, పోరాటంలో తొలి అడుగు వేసిన జనసేనాని, తెలంగాణ ఇంటర్‌మీడియట్‌ బోర్డు నిర్వాకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. పవన్‌కళ్యాణ్‌ పేరుతో జనసేన పార్టీ ఓ లేఖ విడుదల చేసింది ఈ రోజు.

విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, లేఖాస్త్రంతో హెచ్చరించిన విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనానికి ఎంతటి అభిమాన గణం వుందో, అంతకు మించిన అభిమానగణం తెలంగాణలోనూ వుంది. అది కేవలం సినీ అభిమానమే కాదు, దాన్ని రాజకీయ అభిమానంగానూ మార్చుకోవాలన్న ఆలోచనతో వున్న జనసేన పార్టీకి ఇది కలిసొచ్చిన సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

జనసేనాని గనుక ప్రత్యక్షంగా రంగంలోకి దిగి, బాధిత విద్యార్థుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయగలిగితే, తెలంగాణలో జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా నిలబడేందుకు అవకాశాలు పెరుగుతాయి. మొత్తంగా ఈ రోజు వరకు 19 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలకు దిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందే, ఆత్మ బలిదానాల పునాదుల మీదనన్న అభిప్రాయం ఒకటి బలంగా తెలంగాణ ప్రజల్లో నాటుకుపోయింది. ఆ ఆత్మబలిదానాల్ని రాజకీయంగా వాడుకుని, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం.

అయితే, దురదృష్టవశాత్తూ విద్యార్థుల ఆత్మబలిదానాల్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. విద్యా శాఖ మంత్రి విద్యార్థుల ఆత్మహత్యల పట్ల ఏమాత్రం సానుభూతి లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరింత ఆందోళ కలిగిస్తున్నాయి. ‘ఎప్పటినుంచో పరీక్షలు జరుగుతున్నాయి.. పాస్‌ అవడం, ఫెయిల్‌ అవడం మామూలే.. విద్యార్థుల ఆత్మహత్యలూ కొత్తేమీ కాదు..’ అని విద్యా శాఖ మంత్రి చెప్పడం శోచనీయమే.

ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలవాలి. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కి సంబంధించి ఫీజు లేకుండా చేయాలని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేసిన డిమాండ్‌ పట్ల బాధిత విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా పవన్‌ తమకు అండగా నిలిచి, తమ తరఫున వాయిస్‌ వినిపించాలనీ, ప్రభుత్వాన్ని నిలదీయాలనీ కోరుతున్నారు. చాలా సెన్సిటివ్‌ విషయమిది. రాజకీయ కోణంలో కాకపోయినా, విద్యార్థుల కోసం జనసేనాని ఉద్యమ బాట పట్టాల్సిందేనేమో!

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ కోసమంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేసిన ఓ సినీ ప్రముఖుడు, ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీలో చేరి నానా యాగీ చేశారు ఎన్నికల సమయంలో. ఆయనిప్పుడు తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై పెదవి విప్పకపోవడమేంటో? విద్యా సంస్థలకు అధిపతి అయిన ఆ సినీ ప్రముఖుడు, వుంటున్నది తెలంగాణలోనే కదా!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...