ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టిన జనసేన అధినేత పవన్కళ్యాణ్, తెలంగాణలోని లోక్సభ ఎన్నికల విషయంలో మాత్రం ‘మమ’ అనిపించేశారు. హైద్రాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి జనసేనాని ఓ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెల్సిందే. అయినప్పటికీ తెలంగాణలో జనసేన నేతలు అంత యాక్టివ్గా కనిపించడంలేదు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వంటి పార్టీలే తెలంగాణలో గట్టిగా గళం విప్పడానికి జంకుతున్న ఈ పరిస్థితుల్లో జనసేనాని, తెలంగాణపై ఫోకస్ పెట్టాలనే నిర్ణయానికి రావడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అచేతనావస్థలోకి వెళ్ళిపోయింది. అయితే, జనసేన మాత్రం ధైర్యంగా నిలబడింది. జనసేన అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రజానీకంలోనూ జనసేన ధైర్యం పట్ల పాజిటివ్ స్పందన కనిపించింది. విజయావకాశాల గురించి ఆలోచించకుండా, పోరాటంలో తొలి అడుగు వేసిన జనసేనాని, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. పవన్కళ్యాణ్ పేరుతో జనసేన పార్టీ ఓ లేఖ విడుదల చేసింది ఈ రోజు.
విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్కళ్యాణ్, లేఖాస్త్రంతో హెచ్చరించిన విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యింది. ఆంధ్రప్రదేశ్లో జనసేనానికి ఎంతటి అభిమాన గణం వుందో, అంతకు మించిన అభిమానగణం తెలంగాణలోనూ వుంది. అది కేవలం సినీ అభిమానమే కాదు, దాన్ని రాజకీయ అభిమానంగానూ మార్చుకోవాలన్న ఆలోచనతో వున్న జనసేన పార్టీకి ఇది కలిసొచ్చిన సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
జనసేనాని గనుక ప్రత్యక్షంగా రంగంలోకి దిగి, బాధిత విద్యార్థుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయగలిగితే, తెలంగాణలో జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా నిలబడేందుకు అవకాశాలు పెరుగుతాయి. మొత్తంగా ఈ రోజు వరకు 19 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలకు దిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందే, ఆత్మ బలిదానాల పునాదుల మీదనన్న అభిప్రాయం ఒకటి బలంగా తెలంగాణ ప్రజల్లో నాటుకుపోయింది. ఆ ఆత్మబలిదానాల్ని రాజకీయంగా వాడుకుని, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం.
అయితే, దురదృష్టవశాత్తూ విద్యార్థుల ఆత్మబలిదానాల్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. విద్యా శాఖ మంత్రి విద్యార్థుల ఆత్మహత్యల పట్ల ఏమాత్రం సానుభూతి లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరింత ఆందోళ కలిగిస్తున్నాయి. ‘ఎప్పటినుంచో పరీక్షలు జరుగుతున్నాయి.. పాస్ అవడం, ఫెయిల్ అవడం మామూలే.. విద్యార్థుల ఆత్మహత్యలూ కొత్తేమీ కాదు..’ అని విద్యా శాఖ మంత్రి చెప్పడం శోచనీయమే.
ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలవాలి. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కి సంబంధించి ఫీజు లేకుండా చేయాలని జనసేన అధినేత పవన్కళ్యాణ్ చేసిన డిమాండ్ పట్ల బాధిత విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా పవన్ తమకు అండగా నిలిచి, తమ తరఫున వాయిస్ వినిపించాలనీ, ప్రభుత్వాన్ని నిలదీయాలనీ కోరుతున్నారు. చాలా సెన్సిటివ్ విషయమిది. రాజకీయ కోణంలో కాకపోయినా, విద్యార్థుల కోసం జనసేనాని ఉద్యమ బాట పట్టాల్సిందేనేమో!
ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీ-ఎంబర్స్మెంట్ కోసమంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేసిన ఓ సినీ ప్రముఖుడు, ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీలో చేరి నానా యాగీ చేశారు ఎన్నికల సమయంలో. ఆయనిప్పుడు తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై పెదవి విప్పకపోవడమేంటో? విద్యా సంస్థలకు అధిపతి అయిన ఆ సినీ ప్రముఖుడు, వుంటున్నది తెలంగాణలోనే కదా!
705840 196206Gratitude for building this send! I in reality comprehend the no cost info. 736171