మిస్టరీగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. హత్య కేసులో అనుమనితుడిగా ఉన్న సునీల్ యాదవ్ను గోవాలో సీబీఐ అరెస్టు చేసింది. ఈ విషయాన్ని సీబీఐ కూడా ధృవీకరించింది.
సునీల్ యాదవ్ ను నిన్న ఉదయం గోవా స్థానిక కోర్టులో హాజరుపరిచారు. స్థానిక కోర్టు ద్వారా ట్రాన్సిట్ రిమాండ్లోకి తీసుకున్న సీబీఐ అధికారులు సునీల్ యాదవ్ ను కడపకు తరలించి కడప కోర్టులో హాజరుపరచనున్నారు. ఈక్రమంలో సునీల్ ను బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనంలో కడపకు తీసుకొచ్చారు.
ప్రస్తుతం సునీల్ యాదవ్ ను కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో ఉంచినట్టు తెలుస్తోంది. మరోవైపు.. కడప కేంద్ర కారాగార అతిథి గృహంలో వివేక సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి , మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.