కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా? దర్శనం కోసం చాంతాడంత క్యూ లైన్లో గంటల తరబడి వేచి చూడకుండా వేగంగా దర్శనం అయిపోతే ఎంతో బాగుంటుందని భావిస్తున్నారా? సెలవు దొరకడంలేదు.. ఒక్కరోజులోనే శ్రీవారిని చూసి వచ్చే అవకాశం ఉంటే సూపర్ గా ఉంటుందని అనుకుంటున్నారా? మీలాంటి వారి కోసమే ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) సరికొత్త ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఒక్కరోజులోనే తిరుమల శ్రీవారి దర్శనంతోపాటు శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు, శ్రీకాళహస్తి దేవాలయాలను సైతం దర్శించుకునేలా కొత్త ప్యాకేజీకి రూపకల్పన చేసింది.
విజయవాడలో తొలి రోజు రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర.. మరుసటి రోజు రాత్రి 10 గంటలకు తిరుపతిలో తిరుగు ప్రయాణమై మూడో రోజు ఉదయం విజయవాడ చేరడంతో ముగస్తుంది. అంటే, కేవలం ఒకే రోజులో ఆలయాల సందర్శన మొత్తం పూర్తవుతుందన్నమాట. తిరుమల శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి చూసే అవసరం లేకుండా కేవలం రెండు గంటల్లోనే శీఘ్రదర్శనం చేసుకునేలా ఏపీటీడీసీ ఏర్పాట్లు చేసింది. తిరుమలలో దిగిన తర్వాత మూడు గంటల్లోనే దర్శనం, ఇతర కార్యక్రమాలు ముగించుకుని మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యేలా షెడ్యూల్ రూపొందించింది.
విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఏపీటీడీసీ సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం ప్రధాన పికప్ పాయింట్ కాగా.. పటమట, బెంజ్ సర్కిల్, లబ్బీపేట తదితర ప్రధాన ప్రాంతాల్లో కూడా పర్యాటకులు బస్సు ఎక్కే వెసులుబాటు ఉంది. అన్ని ఆలయాల్లో ప్రత్యేక దర్శనంతోపాటు అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలు, శ్రీకాళహస్తిలో బస కలిపి ఈ ప్యాకేజ్ రూపొందించారు. అంతేకాకుండా రెండు లీటర్ల వాటర్ బాటిల్ కాంప్లిమెంటరీగా అందజేస్తారు. ఈ ప్యాకేజీ ధర పెద్దలు ఒక్కొక్కరికీ రూ.3,775గా నిర్ణయించగా.. పిల్లలకు రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. రోజు విడిచి రోజు ఉండే ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలకు, టికెట్ల బుకింగ్ కు ఏపీ టూరిజం వెబ్ సైట్ తో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పర్యాటక శాఖ రిజర్వేషన్ కేంద్రాలు లేదా 180042545454 టోల్ ఫ్రీ నెంబర్లో సంప్రదించాలి.
ఇదీ షెడ్యూల్…
మొదటి రోజు:
రాత్రి 10 గంటలు: విజయవాడ నుంచి ప్రయాణం ప్రారంభం
రెండోరోజు:
ఉదయం 5 గంటలు: శ్రీకాళహస్తి చేరిక.. ఏపీటీడీసీ హోటల్ లోకి చెకిన్
ఉదయం 7 నుంచి 7.30 వరకు: అల్పాహారం
ఉదయం 7.30 గంటలకు: తిరుపతి పయనం
ఉదయం 8.30 గంటలకు: తిరుపతి బస్టాండ్ కు చేరిక. తిరుమల బస్సు ఎక్కడం
ఉదయం 9.30 గంటలకు: తిరుమల చేరిక
9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య: తలనీలాల సమర్పణ అనంతరం శ్రీవారి శీఘ్ర దర్శనం
మధ్యాహ్నం 12.30 గంటలకు: తిరుపతి పయనం
మధ్యాహ్నం 1.30 గంటలకు: తిరుపతి చేరిక
1.30 గంటల నుంచి 2.00 గంటల వరకు: మధ్యాహ్న భోజనం
మధ్యాహ్నం 2.00 గంటలకు: శ్రీనివాస మంగాపురం పయనం
మధ్యాహ్నం 2.30 గంటలకు: శ్రీనివాస మంగాపురం చేరిక
2.30 గంటల నుంచి 3.00 గంటల మధ్య: శ్రీనివాస మంగాపురం ఆలయంలో దర్శనం
మధ్యాహ్నం 3.00 గంటలకు: అలివేలు మంగాపురం (తిరుచానూరు) పయనం
సాయంత్రం 4.00 గంటలకు: అలివేలు మంగాపురం (తిరుచానూరు) చేరిక
4.00 గంటల నుంచి 5.00 గంటల మధ్య: తిరుచానూరు ఆలయ దర్శనం
సాయంత్రం 5.00 గంటలకు: శ్రీకాళహస్తికి పయనం
సాయంత్రం 6.00 గంటలకు: శ్రీకాళహస్తి చేరిక
6.00 గంటల నుంచి 7.00 గంటల మధ్య: శ్రీకాళహస్తి దర్శనం
సాయంత్రం 7.30 గంటలకు: శ్రీకాళహస్తిలోని ఏపీటీడీసీ హోటల్ కి చేరిక
7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు: రాత్రి భోజనం
రాత్రి 9.00 గంటలకు: విజయవాడకు పయనం
మూడో రోజు:
ఉదయం 4.30 గంటలకు: విజయవాడ చేరిక
645443 372396Great info many thanks sharing and reaching us your subscriber list. 197060
632762 297633I truly appreciate this post. Ive been seeking all more than for this! Thank goodness I found it on Bing. Youve made my day! Thank you once more.. 973568
533015 172052I enjoy your writing type, do maintain on writing! Ill be back! 745536
508647 742600The subsequent time I read a weblog, I hope that it doesnt disappoint me as a whole lot as this one. I mean, I know it was my option to read, but I truly thought youd have something attention-grabbing to say. All I hear is really a bunch of whining about something which you possibly can repair should you werent too busy on the lookout for attention. 691