దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ వైరస్ బారిన పడినవారు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారు. ఇక తమ చావు ఖాయమనే భావన ఎక్కువమందిలో కనిపిస్తోంది. నిజానికి వైరస్ కంటే ఆ భయం వల్లే ఎక్కువ నష్టం జరుగుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. కరోనా వచ్చినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ధైర్యంగా ఉంటే సగం రోగం తగ్గినట్టేనని చెబుతున్నారు. చాలా ప్రాణాంతక వ్యాధులతో పోలిస్తే కరోనా మరణాల శాతం చాలా తక్కువ. కేన్సన్ బాధితుల్లో 50 శాతం చనిపోతుండగా.. కరోనా వల్ల చనిపోతున్నవారి సంఖ్య ఒక శాతం కంటే తక్కువే. ఈ వైరస్ బారినపడినవారిలో దాదాపు 99 శాతం మంది కోలుకుని సాధారణ జీవితం గడుపుతున్నారు.
అందువల్ల కరోనా వచ్చిందని ఆందోళన చెందొద్దని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వచ్చిన ప్రతిఒక్కరికీ ఆక్సిజన్ అవసరం లేదని.. ఊపిరితిత్తులు, ఇతర ఇబ్బందులు ఉన్నవారికి మాత్రమే దాని అవసరం ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వచ్చి తీవ్ర భయాందోళనలకు గురవుతున్నవారికి 104 ద్వారా కౌన్సెలింగ్ చేయాలని నిర్ణయించినట్టు విశాఖలోని మానసిక వైద్యశాఖ రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ భాగ్యారావు వెల్లడించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 500 మంది మానసిక వైద్య నిపుణులతో ఈ సేవలు అందుతాయని తెలిపారు.
148679 882603This internet site is my breathing in, genuinely very good layout and perfect content . 114878
179250 603888Thanks for this amazing post! It has long been really beneficial. I wish that you will carry on posting your wisdom with us. 40997