ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య పెరగబోతోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో ఇకపై 26 జిల్లాలు రానున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాధమిక నోటిఫికేషన్ పై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు 30 రోజుల్లో తెలియజేయాలని కోరింది. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో కొత్త జిల్లాలివే..
జిల్లా జిల్లా కేంద్రం
- శ్రీకాకుళం జిల్లా – శ్రీకాకుళం మన్యం
- విజయనగరం జిల్లా – విజయనగరం
- విశాఖపట్నం జిల్లా – విశాఖపట్నం
- అనకాపల్లి జిల్లా – అనకాపల్లి
- కాకినాడ జిల్లా – కాకినాడ
- కోనసీమ జిల్లా – అమలాపురం
- తూర్పు గోదావరి జిల్లా – రాజమహేంద్రవరం
- పశ్చిమ గోదావరి జిల్లా – భీమవరం
- ఏలూరు జిల్లా – ఏలూరు
- మచిలీపట్నం జిల్లా – మచిలీపట్నం
- ఎన్టీఆర్ కృష్ణా జిల్లా – విజయవాడ
- గుంటూరు జిల్లా – గుంటూరు
- పల్నాడు జిల్లా – నరసారావు పేట
- బాపట్ల జిల్లా – బాపట్ల
- ప్రకాశం జిల్లా – ఒంగోలు
- నంద్యాల జిల్లా – నంద్యాల
- కర్నూలు జిల్లా – కర్నూలు
- అనంతపురం జిల్లా – అనంతపురం
- శ్రీ సత్యసాయి జిల్లా – పుట్టపర్తి
- వైఎస్సార్ జిల్లా జిల్లా – కడప
- శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా – నెల్లూరు
- బాలాజీ జిల్లా – తిరుపతి
- అన్నమయ్య జిల్లా – రాయచోటి
- చిత్తూరు జిల్లా – చిత్తూరు
- మన్యం జిల్లా – పార్వతీపురం
- అల్లూరి సీతారామరాజు జిల్లా – పాడేరు
రెవెన్యూ డివిజన్ల ప్రకారం చూస్తే చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్ 33 మండలాలతో అతి పెద్దదిగా ఉంది. 33 మండలాలు ఉన్న ఈ డివిజన్ ను పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా 10-12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. వచ్చే ఉగాదికి కొత్త జిల్లాల ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
875557 71878I was looking for this. Truly refreshing take on the info. Thanks a good deal. 878039