ఇప్పటికే కరోనా వల్ల దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ప్రతి చోట కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఏం చేసినా కరోనా కేసులు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు అనేది ప్రభుత్వ వాదన. ఈ సమయంలోనే ప్రతి ఒక్కరు కూడా సొంతంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెబుతున్నారు. చిన్న పిల్లల విషయంలో ఎంతగా జాగ్రత్తలు పాటిస్తున్నా కూడా ఏదో ఒక సమయంలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. తాజాగా చిన్న పిల్లల్లో స్క్రబ్ టైఫస్ అనే కొత్త వ్యాది ఒకటి సోకుతుంది.
యూపీలోని మధుర జిల్లాలో ఈ వ్యాది సోకిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే 8 మంది ఈ వ్యాది వల్ల మృతి చెందినట్లుగా అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాదికి గురైన వారు 10 రోజుల వరకు విపరీతమైన జ్వరం ఉంటుంది, ముక్కు కారణం, ఒల్లు నొప్పులు ఉంటాయి. ఒళ్లంతా కూడా దురదగా ఉండి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ వ్యాది ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాది విషయమై మరింత అధ్యయనం అవసరం అంటూ ప్రభుత్వ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
677768 959303You could certainly see your skills in the work you write. 637168
438383 340933bless you with regard to the particular weblog post ive genuinely been looking with regard to this kind of advice on the net for sum time these days hence with thanks 850523