ఏపీ ప్రభుత్వం నెల నెల పింఛన్ల విధానంను తీసుకు వస్తున్నట్లుగా సజ్జల పేర్కొన్నారు. ఇప్పటి వరకు రెండు మూడు నెలలకు ఒక సారి కలిపి పింఛన్లు ఇస్తున్నారు. కొందరు దూర ప్రాంతాల్లో ఉన్న వారు మూడు నెలలకు ఒకసారి వచ్చి పింఛన్లు తీసుకుంటున్నారు. దీని వల్ల అనర్హులకు పింఛన్లు అందండంతో పాటు అవినీతి కూడా చోటు చేసుకుంటుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి నెల నెల మాత్రమే పింఛన్లు ఇవ్వాలని తదుపరి నెల పింఛన్లను ఇచ్చేందుకు నో చెప్పాలంటూ అధికారులకు సూచించారు.
చంద్రబాబు హయాంలో ఇచ్చిన వారి కంటే ఇప్పుడు అధికంగా 10 లక్షల మందికి ఇస్తున్నట్లుగా సజ్జల పేర్కొన్నాడు. ప్రతిపక్షాల వారు పింఛన్ల విషయంలో విమర్శలు చేస్తున్నారు. అనర్హులు అయిన వారికి కూడా పింఛన్లను ఇవ్వాలా అంటూ సజ్జల ప్రశ్నించాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అవినీతి మరియు అశ్రద్ద కారణంగా రాష్ట్రంలో పలు సమస్యలు తలెత్తాయి అంటూ ఆయన పేర్కొన్నాడు. జగన్ ప్రభుత్వం ఆ సమస్యలన్నింటిని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
562936 256077Outstanding post, I believe individuals should learn a lot from this web site its rattling user genial . 660095