కత్తి మహేష్ కారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయ పడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన యాక్సిడెంట్ పై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారు డ్రైవింగ్ సీటులో కూర్చుని ఉన్న సురేష్ కు పెద్దగా గాయాలు కాలేదు. కాని కత్తి మహేష్ కు మాత్రం ఎందుకు అంతగా గాయాలు అయ్యాయి.. చనిపోయాడు అంటూ మంద కృష్ణ మాదిగ వంటి వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేష్ తండ్రి కూడా ఈ విషయమై అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఆదిపూలపు సురేష్ విచారణకు సిద్దం అన్నారు.
కారు యాక్సిడెంట్ సమయంలో కత్తి మహేష్ పక్కన ఉన్న సురేష్ ను పోలీసులు విచారించారు. కత్తి మహేష్ కు ఆయన బిజినెస్ పార్టనర్ అని… ఒక మైనింగ్ విషయమై మాట్లాడేందుకు చిత్తూరు కలిసి వెళ్తున్నట్లుగా పేర్కొన్నాడు. తామిద్దరం చాలా కాలంగా స్నేహితులం మరియు బిజినెస్ పార్టర్స్ గా ఆయన చెబుతున్నాడు. చిత్తూరు జిల్లా ఉదయ మాణిక్యం వద్ద మైనింగ్ చేద్దామని అనుకున్నామని ఆ పని మీదే వెళ్తున్నట్లుగా సురేష్ చెప్పాడట. పోలీసులు కత్తి మహేష్ మృతి విషయమై మరి కొందరిని కూడా ప్రశ్నించబోతున్నారట.
326743 742336Hello! I could have sworn Ive been to this web site before but following browsing by means of some with the post I realized it is new to me. Nonetheless, Im certainly happy I identified it and Ill be book-marking and checking back frequently! 113147