దేశంలో కరోనా తీవ్రత హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. కేసుల నమోదులో స్వల్ప తగ్గుదల కనిపించినా వరుసగా అయిదో రోజు కూడా 3వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
గడచిన 24 గంటల్లో దేశంలో 2.95 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,157 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1485, హరియాణాలో 479, కేరళలో 314, ఉత్తరప్రదేశ్ లో 268, మహారాష్ట్రలో 169.. తో ఈ అయిదు రాష్ట్రాల నుంచే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ముందు రోజు ఈ సంఖ్య 3,324 గా ఉంది. నిన్న కరోనాతో దేశంలో 26 మంది మృతి చెందారు. మొత్తంగా కరోనాతో 5.23 లక్షల మంది మృతి చెందారు.
నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 2723 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19,500గా ఉన్నాయి. నిన్న 4.02 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తంగా దేశంలో 189 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.
762921 530227my English teacher hate me cause i maintain writing about somebody from The WANTED called Jay, she gives me evils and low 161365