హైదరాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంటోంది. గ్రేటర్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. మాటల యుద్ధం, ప్రచారంలో దూకుడు, వరాల జల్లు.. ఇలా రాజకీయంగా కురుక్షేత్రం జరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ అగ్రనేతల ప్రచారంలో మునిగిపోయాయి. బీజేపీకి ఏకంగా ఇతర రాష్ట్రాలు, ఢిల్లీ నుంచి నేతలు వస్తున్నారు. ఇంతటి రసవత్తర పోరులో మరో కీలక ఘట్టానికి తెర లేవనుంది. అదే.. ప్రధాని హైదరాబాద్ పర్యటన. అయితే.. ప్రధాని వచ్చేది అధికారిక పర్యటన కోసం. కానీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఈ వార్త సంచలనం రేపుతోంది.
ఈనెల 28న హైదరాబాద్కు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. ఆరోజు ఢిల్లీ నుంచి హకీం పేట్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు ప్రత్యేక విమానంలో మోదీ రానున్నారు. ఐసీఎంఆర్ సహకారంతో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ పురోగతిపై ప్రధాని సమీక్షిస్తారని తెలుస్తోంది. ఈ పర్యటనకు ముందు 28వ తేదీన పూణె నగరానికి వెళ్లి సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పై కూడా ప్రధాని సమీక్ష జరుపనున్నారు. వ్యాక్సిన్ ప్రయోగాల దశ, ఉత్పత్తి, పంపిణీ.. తదితర అంశాలను పరిశీలిస్తారని తెలుస్తోంది.
ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ ఆకస్మికంగా ఖరారైందని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో మోడీ రాకతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే రోజు సీఎం కేసీఆర్ ప్రచారం ఉందని తెలుస్తోంది. ఆరోజు ప్రచారం ముగియడానికి 50 నిముషాల ముందే ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకోనున్నారు. అయితే.. మోదీ వచ్చేది అధికారిక కార్యక్రమానికే గానీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది.
775368 441781Thanks for blogging and i enjoy the weblog posting so no public comments.,,,,,,,,,,, 140483