దేశంలో కరోనా సెకండ్ వేవ్ వార్తలు ఆందోళన కలిగిస్తున్నా ఎవరిలో భయం లేకపోతోంది. ఇందుకు ఉదాహరణగా పింక్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరున్న ‘జైపూర్’ నిలుస్తోంది. మూడు రోజుల్లో ఒక్క జైపూర్ లోనే 4వేల వివాహాలు జరుగనున్నాయి. ఈ సంఖ్య ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. 25వ తేదీన 3285 కేసులు నమోదయ్యాయి. వివాహాలు ఎక్కువగా జరుగుతున్న జైపూర్ లోనే 600 కేసులు నమోదవడంతో పెళ్లిళ్లు ఉన్న మరో రెండు రోజుల్లో కఠినంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది.
నవంబర్ 25, 27, 30 తేదీల్లో జైపూర్ లో 4వేల పెళ్లిల్లు జరుగుతున్నాయి. ఓవైపు రాష్ట్రంలో రోజుకు 3వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిల్లు అంటే.. షాపింగ్, ఫంక్షన్లలో కరోనా విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎవరూ తగ్గడం లేదు. ఇంకా ఎక్కువ మంది మధ్య జరగాల్సిన పెళ్లి తక్కువమంది మధ్య జరుగుతోందని వధూవరులు విచారం వ్యక్తం చేయడం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అలెర్ట్ అయింది. కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
100 మందికి మించి ఫంక్షన్లలో ఎవరూ ఉండకూడదని ఆదేశించింది. వేడుకలలో శానిటైజర్లు, మాస్క్.. వినియోగం తప్పనిసరని తేల్చి చెప్పింది. భౌతికదూరం పాటిస్తూ ఉండాలని సూచించింది. పెళ్లి మొత్తం వీడీయోలు తీయాలని కూడా చెప్పింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 25వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. గత నాలుగు రోజుల్లోనే రాష్ట్రంలో 1.34 శాతం కరోనా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. రాజస్థాన్ లో ఇప్పటివరకూ 2,53,767 కేసులు.. 2218 మరణాలు సంభవించాయి.
628401 74806This is an excellent article and I entirely understand where your coming from in the third section. Perfect read, Ill regularly follow the other reads. 478952
337454 868466Great web site you got here! Please keep updating, I will def read far more. Itll be in my bookmarks so much better update! 107144
437227 323757TeenVogue? Seeking for fashion advice, celebrity buzz or beauty trends? Find it all in Teen Vogue 670407
928064 74617Spot up for this write-up, I really feel this outstanding site requirements a whole lot far more consideration. Ill far more likely be once once again to read considerably a lot more, thank you that information. 180269