తాను క్యాన్సర్ బారిన పడినట్లు వస్తున్న వార్తలని మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi)ఖండించారు. ఈరోజు హైదరాబాద్లోని ఓ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిరు.. తను కొలనోస్కోపీ చేయించుకున్నట్లు చెప్పారు. అయితే ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న కొన్ని మీడియా సంస్థలు చిరంజీవి క్యాన్సర్ బారిన పడినట్లు రాశాయి. దీనిపై చిరు స్వయంగా ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవలసిన అవసరం గురించి మాట్లాడినట్లు తెలిపారు. రెగ్యులర్ గా మెడికల్ చెకప్ చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చన్నారు. ఆయన అలర్ట్ గా ఉండి కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకున్నట్లు తెలిపారు. అందులో ‘నాన్ క్యాన్సర్స్ పోలిప్స్’ ని గుర్తించి తీసేసినట్లు తెలిపారు. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకుండా ఉంటే అది క్యాన్సర్ గా మారేదేమో అన్నారు. కాబట్టి ముందుగా అందరూ స్క్రీనింగ్ టెస్ట్ లు చేయించుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు అవగాహన రాహిత్యంతో చిరునే క్యాన్సర్ బారిన పడినట్లు స్క్రోలింగ్ ఇచ్చేశాయి. దీంతో చిరు శ్రేయోభిలాషులు, అభిమానులు ఆందోళన పడ్డారు. ఫలితంగా చిరు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. పాత్రికేయులు అవగాహన రాహిత్యంతో కాకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023