మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆటో జానీ అంటూ టైటిల్ ను ఖరారు చేసి సినిమా ను మొదలు పెట్టినట్లుగా కూడా పూరి ఆ మధ్య చెప్పుకొచ్చాడు. కానీ సినిమా క్యాన్సిల్ అవడం పట్ల పూరి చాలా నిరాశ పడ్డాడు.
అదే సమయంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా ను ఉద్దేశించినట్లుగా ఛార్మీ ట్విట్టర్ లో స్మైల్ ఈమోజీలు పెట్టి షేర్ చేసింది. అంతా కూడా బ్రూస్ లీ సినిమా యొక్క ఫ్లాప్ కి ఛార్మీ ఆ ట్వీట్ చేసిందని.. పూరి పై తనకు ఉన్న అభిమానంతో అప్పట్లో ఆయనకు జరిగిన అవమానంకు ప్రతిగా ఆ ట్వీట్ చేసింది అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆమె నిర్మాణంలో పూరి దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఛార్మీ ట్వీట్ కి కౌంటర్స్ ఇస్తున్నారు.
మెగా ఫ్యాన్స్ ఆ ట్వీట్ ను తెగ వైరల్ చేస్తున్నారు. ఛార్మీ పొగరు ఇప్పుడు దిగిందా అంటూ ఆ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఎవరి యొక్క ఫెయిల్యూర్ ను ఎగతాళి చేయవద్దని ఛార్మికి ఇప్పటికి అయినా అర్థం అవ్వాలని కోరుకుంటున్నాం అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
499592 495399definitely like your internet site but you want to check the spelling on several of your posts. Several of them are rife with spelling problems and I discover it really troublesome to tell the truth nevertheless I will definitely come back again. 69769
Also I ve shared your site in my social networks!
Definitely what a great blog and instructive posts I definitely will bookmark your site.All the Best! .