పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కి బీజేపీ అధినాయకత్వంకు అస్సలు పడటం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్రంగా మమతను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాని మమత అందుకు ధీటుగా స్పందిస్తూ కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇటీవల కేంద్ర ఆదేశాలను సీఎస్ ఆలాపన్ బంద్యోపాధ్యాయ్ పట్టించుకోన్నట్లుగా వ్యవహరించాడు. దాంతో ఆయన్ను వెంటనే డిప్యూటేషన్ పై ఢిల్లీకి రమ్మంటూ కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఆలాపన్ ను పంపించడం ఇష్టం లేని మమత ఆయన్ను రిలీవ్ చేసేందుకు తిరష్కరించింది.
కేంద్రం తన రిటైర్మెంట్ గడువును పెంచుతూ తీసుకున్న నిర్ణయంను ఉపసంహరించుకోకుండానే ఆలాపన్ తన పదవికి రాజీనామా చేశాడు. సీఎస్ గా రాజీనామా చేసిన ఆయన్ను వెంటనే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా మమత నియమించింది. దాంతో కేంద్రంకు ఆమె గట్టి షాక్ ఇచ్చింది. కరోనా సమయంలో ఆయన చాలా చురుకుగా పని చేశారని ఆయన అవసరం ప్రస్తుతం ఉందనే ఉద్దేశ్యంతో మమత ఆయన్ను సీఎస్ గా కొనసాగించాలనుకుంటే కేంద్రం నో చెప్పింది. దాంతో ఆయన రాజీనామా చేస్తే ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఇప్పుడు కేంద్రం రియాక్షన్ ఏంటో..!
112341 711404I gotta favorite this website it seems handy really helpful 189465
272974 75473I believe one of your advertisings triggered my internet browser to resize, you may properly want to put that on your blacklist. 404912