సూపర్ స్టార్ మహేష్బాబు తన కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించేశాడు. ‘సరిలేరు నీకెవ్వరూ’ ప్రమోషన్స్ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటాననీ, ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాననీ మహేష్బాబు స్పష్టం చేశాడు. వంశీ – మహేష్ కాంబినేషన్లో ‘మహర్షి’ సినిమా రావడం, ఆ తర్వాతి నుంచీ ఇద్దరి మధ్యా స్నేహం పెరగడం, ఆ స్నేహం కాస్తా ‘ఫ్యామిలీ బాండింగ్’ తరహాలో మారడం తెలిసిన విషయాలే.
వరుసగా సీరియస్ మూవీస్ చేసిన తాను ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో కంప్లీట్ ఎంటర్టైనర్ చేశాననీ, వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమా కూడా పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనరేనని మహేష్ చెప్పుకొచ్చాడు. ‘సరిలేరు నీకెవ్వరూ’ ప్రమోషన్స్లో బిజీగా వున్న మహేష్, తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘కెజిఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేయాల్సి వుందనీ, కొన్ని కథల్ని ఇప్పటికే వినడం జరిగిందనీ, అయితే ఆయనతో సినిమాకి కొంత టైమ్ పట్టవచ్చుననీ మహేష్ చెప్పాడు.
ఇకపై సినిమాలు మరింత వేగంగా చేయాలనుకుంటున్నట్లు వెల్లడించిన మహేష్, అన్ని సినిమాలకీ ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాకి కుదిరినంత వేగం కుదరకపోవచ్చని అభిప్రాయపడ్డాడు ఈ సూపర్ స్టార్. ‘ఎఫ్2’ సమయంలోనే అనిల్ రావిపూడి తనకు ‘సరిలేరు నీకెవ్వరు’ కథ చెప్పాడనీ, సినిమా కోసం ఐదు కిలోల బరువు తగ్గే క్రమంలో తానే కొంత ఆలస్యం చేశానని మహేష్ వెల్లడించాడు.
61064 775642I genuinely enjoy searching at on this internet site , it has great content material . 256167