వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు.. రాజధాని అమరావతిలో రైతులు 23 రోజులుగా ఆందోళనలు చేస్తోంటే, వారిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులని వైసీపీ నేత, ఎస్వీబీసీ ఛైర్మన్ పృధ్వీ విమర్శించిన విషయం విదితమే. ఇందుకుగాను, పృధ్వీ దిష్టిబొమ్మల్ని చెప్పులతో కొట్టారు రాజధాని అమరావతి ప్రాంత రైతులు.
మరోపక్క సినీ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళి సైతం పృధ్వీపై విరుచుకుపడ్డారు. ‘నీలాంటి వాళ్ళ వల్లనే సీఎం వైఎస్ జగన్ ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో పార్టీ భ్రష్టుపట్టిపోయే పరిస్థితి వచ్చింది..’ అంటూ మొత్తంగా వైసీపీ నేతలందర్నీ ఏకిపారేశారు పోసాని కృష్ణమురళి. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్న రైతుల్ని ఉద్దేశించి దాదాపు వైసీపీలో ప్రతి నాయకుడూ ‘పెయిడ్ ఆర్టిస్ట్’ అనే ఆరోపణలు చేసిన విషయం విదితమే.
పోసానితో వ్యవహారం అలాగే వుంటుంది.. ఏకిపారేయడం మొదలు పెడితే మన, తన, పర అన్న తేడాలుండవ్. తక్షణం ‘పెయిడ్ ఆర్టిస్ట్’ ఆరోపణలు చేసినవారంతా రాజధాని అమరావతి ప్రాంతంలోని మహిళా రైతులకు క్షమాపణ చెప్పాలని పోసాని డిమాండ్ చేయడం గమనార్హం.
మరోపక్క, పోసాని కృష్ణమురళి షరామామూలుగానే చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాజధాని ఆందోళనల పేరుతో ఉద్రిక్త పరిస్థితులకు చంద్రబాబు తెరలేపారని పోసాని మండిపడ్డారు. మొత్తమ్మీద, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వాతలు పెడుతూనే, చంద్రబాబుని తిట్టడం ద్వారా ‘వెన్న’ పూశారన్నమాట పోసాని కృష్ణమురళి.
80326 843563 Nice post. I learn something far more challenging on different blogs everyday. It will always be stimulating to read content material from other writers and practice slightly something from their store. Id prefer to use some with the content on my blog whether you dont mind. Natually Ill give you a link on your web weblog. Thanks for sharing. 242694
291059 9647Deference to op , some superb entropy. 57584
728037 468543I love your writing style truly enjoying this web web site . 57375