Rahul Gandhi: కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడింది. దీంతో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కి పెద్ద షాక్ తగిలినట్లు అయింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు కాపీ ని పరిశీలించిన లోక్సభ సచివాలయం ఈ మేరకు రాహుల్ పై చర్యలకు ఉపక్రమించింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలోని కోలార్ లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ‘ దొంగలందరూ మోడీ అనే ఇంటి పేరుని ఎందుకు కలిగి ఉంటారో ?’ అంటూ వ్యాఖ్యానించారని భాజపా ఎంపీ పూర్ణేష్ మోడీ సూరత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు రాహుల్ పై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో గురువారం సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది.
రాహుల్ అభ్యర్థన మేరకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఆ మరుసటి రోజు లోక్సభ సచివాలయం రాహుల్ ని అనర్హుడిగా ప్రకటించింది. ఏదైనా కేసులో దోషిగా శిక్ష పడిన వారికి ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హత ఉండదంటూ.. ప్రజా ప్రాతినిధ్య చట్టం లో చేసిన మార్పులను గుర్తు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రజాప్రతినిధులు ఎవరైనా ఏదైనా కేసులో దోషులుగా తేలితే, రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడినట్లయితే వారిని వెంటనే అనర్హులుగా ప్రకటించాలని 2013లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనర్హులుగా తేలిన వారు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే వీలుండదు. ఈ పరిణామాల వల్ల రాహుల్ గాంధీ వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయినట్టే.
355194 581763Some genuinely prime posts on this website , bookmarked . 795207
757206 194960Now we know who the ssebnile one is here. Fantastic post! 700089
643896 616431I got what you intend, saved to my bookmarks , very decent website . 404246
821181 155119very good publish, i surely enjoy this internet website, keep on it 654811