YSRCP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై అధికార వైసిపి చర్యలు తీసుకుంది. ఈ మేరకు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వీరిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
నిన్నటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా.. ఆ పార్టీకి 19 మంది బలం మాత్రమే ఉంది. అయితే ప్రతిపక్ష టీడీపీ తరఫున బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధ 23 ఓట్ల తో అనూహ్య విజయం సాధించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ అధికార వైసిపి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొంతకాలంగా సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ అంతరాత్మ ప్రబోధానుసారం ఓట్లేస్తామని గతంలోనే ప్రకటించారు. అయితే, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ల ఓట్లు అనూహ్యంగా టీడీపీ ఖాతాలో పడ్డాయి.
173251 745234Sweet internet site , super pattern , really clean and utilize friendly . 257781
714405 951318Conveyancing […]we like to honor other websites on the internet, even if they arent related to us, by linking to them. Below are some web sites worth checking out[…] 548465
740275 692760I genuinely like your writing style, wonderful info, thankyou for posting : D. 885753