Liger: పూరి జగన్నాథ్ లైగర్ సినిమాకి సంబంధించి దీక్ష చేస్తున్న ఎగ్జిబిటర్లు ఇవాళ దీక్ష విరమించారు. నిర్మాతల మండలి అలాగే తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ మాట ఇవ్వడం వల్ల ఎక్స్ ప్రెసిడెంట్ మురళీమోహన్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అనుపమ రెడ్డి సెక్రటరీ ఆధ్వర్యంలో దీక్ష విరమించిన ఎగ్జిబిటర్లు.. పూరి జగన్నాద్, చార్మి త్వరలో సామరస్యంగా సాల్వ్ చేస్తామని చెప్పడం వల్ల దీక్ష విరమించామని, అలాగే రీసెంట్గా కొందరు హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం వల్ల ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన ప్రసన్నకుమార్ కి ధన్యవాదాలు. ప్రసన్నకుమార్, మండలి పెద్దలు పాల్గొన్నారు.
అలాగే సునీల్ నారంగ్ గారు సురేష్ దగ్గుబాటి గారు, శిరీష్ గారు అందరు సహాయ సహకారాలతో మేము దీక్ష విరమిస్తున్నాము. మాకు త్వరలో పరిష్కారం రావాలని కోరుకుంటూ…… తెలంగాణ ప్రెసిడెంట్ సునీల్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారు, నిర్మాతలు సెక్రటరీ ప్రశాంత్ కుమార్ గారు, తెలంగాణ చాంబర్స్ అనుపమ్ రెడ్డి గారు, కొందరు పెద్దలు జోక్యం చేసుకుని మాకు కొంచెం మంచి జరుగుతుందని నమ్ముతూ ఈ దీక్ష విరమిస్తున్నామని ఎగ్జిబిటర్లు తెలిపారు..