లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఈ నెల 5న కరోనా వైరస్ సోకడంతో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన ఆగష్టు 13 తర్వాత ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలో చేరాల్సి వచ్చింది. అప్పటినుండి బాలు వెంటిలేటర్ పైనే ఉన్నారు. నిన్న ఈవెనింగ్ బాలు ఆరోగ్యంపై అప్డేట్ ఇస్తున్న క్రమంలో ఎస్పీ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఇంకా ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని, ఎటువంటి పురోగతి లేదని చరణ్ ఎమోషనల్ అయ్యారు. అయితే తన తండ్రి ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్న ప్రతీ ఒక్కరికి పేరు పేరునా కృతఙ్ఞతలు చెబుతున్నా అని రియాక్ట్ అయ్యారు చరణ్.
బాలు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఎంజిఎం ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. విదేశీ వైద్యుల బృందం కూడా రానుందని అన్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఎంజిఎం ఆసుపత్రి తాజా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. ఆ బులిటెన్ లో పేర్కొన్న దాని ప్రకారం బాలు ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని, ఈసీఎంఓ సపోర్ట్ పైనే ఉన్నారని తెలిపారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.
అలాగే ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని సమీక్షించి బాలు కుటుంబానికి అప్డేట్ ఇస్తున్నట్లు తెలిపారు.
711441 824484hey there, your site is low cost. We do thank you for work 203972
712495 259966Thank you for the sensible critique. Me and my neighbor were just preparing to do some research on this. We got a grab a book from our location library but I believe I learned a lot more clear from this post. Im quite glad to see such superb info being shared freely out there. 654546
162035 906434Exceptional post nonetheless , I was wanting to know if you could write a litte far more on this subject? Id be very thankful in the event you could elaborate slightly bit much more. Thanks! 263948