ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పెట్టడం రాజకీయ దుమారం రేపుతుంది. తెలుగు దేశం పార్టీ నాయకులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఈ విషయమై వైకాపా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్పందించడం లేదంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
జగన్ పార్టీలో ఉండి జగన్ ని ప్రశ్నించేందుకు విమర్శించేందుకు భయపడుతున్నారా అంటూ కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. ఈ సమయంలో ఆమె మీడియా ముందుకు వచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గుర్తు రాలేదు, ఎప్పుడు కూడా ఆయన పేరు పెట్టాలని ఆలోచన రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇంత హంగామా చేస్తున్నాడు అంటూ లక్ష్మీ పార్వతి ఆరోపించారు.
చంద్రబాబు వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయించిన సంగతి మర్చిపోయారా అంటూ నందమూరి ఫ్యామిలీ ని ఉద్దేశించి లక్ష్మీపార్వతి కామెంట్స్ చేశారు. రామోజీరావు, చంద్రబాబు, రాధాకృష్ణ కలిసే ఎన్టీఆర్ యొక్క పతనానికి కుట్ర చేశారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ ను చంపిన హంతకుల గురించి అందరికీ తెలియాలి. ఎన్టీఆర్ మరణం హత్య కాదంటావా? ఆ హత్యలో నువ్వు రామోజీ రావు లేరా? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించింది. ఎన్టీఆర్ ని హత్య చేసింది చంద్రబాబు, రామోజీరావు అంటూ లక్ష్మీపార్వతి ఆరోపించారు.
792519 941481Music started playing anytime I opened this internet internet site, so annoying! 410481