Switch to English

ఎన్నికల సిత్రం: ప్రజాస్వామ్యంలోనూ వీళ్ళంతా ‘రాజు’లే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,965FansLike
57,764FollowersFollow

జనాభా ప్రాతిపదికన ఆయా సామాజిక వర్గాలకు చట్ట సభల్లో సీట్లు దక్కడం సాధ్యమేనా.? అంటే, దళితులకు తప్ప, ఇంకెవరికీ అది సాధ్యం కాని వ్యవహారంలా మారింది. చట్ట సభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తప్ప, బీసీలకు రిజర్వేషన్ లేదు. మహిళా కోటా విషయమై చాలాకాలంగా పోరాటాలు నడుస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి, కమ్మ, వెలమ సామాజిక వర్గాలకు రాజకీయాల్లో అగ్ర తాంబూలం దక్కుతోందన్నది నిర్వివాదాంశం. కాపు సామాజిక వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుగా ప్రధాన రాజకీయ పార్టీలు చూస్తున్న వైనమూ కనిపిస్తోంది.

క్షత్రియ సామాజిక వర్గం విషయానికొస్తే, జనాభా శాతానికి మించి, కొందరు క్షత్రియ సామాజిక వర్గ నేతలు సీట్లు దక్కించుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి, క్షత్రియ సామాజిక వర్గం నాయకులకు దక్కిన సీట్లు, ఆయా నేతలకు తమ తమ నియోజకవర్గాల్లో వున్న క్షత్రియ ఓటు బ్యాంకు వివరాల్ని ఒక్కసారి పరిశీలిస్తే, ఆసక్తికరమైన గణాంకాలు కనిపిస్తాయి.

విశాఖపట్నం నార్త్ నుంచి కన్నప్పరాజు వైసీపీ నుంచి బరిలో వున్నారు. ఈ నియోజకవర్గంలో క్షత్రియ ఓటు బ్యాంకు దాదాపు 20 వేలుగా వుంది. యలమంచిలో కన్నబాబురాజుకి నాలుగు వేల క్షత్రియ సామాజిక వర్గం ఓటు బ్యాంకు వుంది. ఇది మొత్తం ఓటు బ్యాంకు. ఒక సామాజిక వర్గమంతా ఒకే పార్టీకి ఓటేస్తుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

ఆచంట నియోజకవర్గంలో చెరుకువాడ రంగనాత రాజు, నర్సాపురం నుంచి ముదునూరి ప్రసాదరాజు, ఉండి నరసింహరాజు తదితరులు క్షత్రియ సామాజిక వర్గం నుంచి బరిలో వున్నారు. వీరంతా వైసీపీ నాయకులే. కూటమి విషయానికొస్తే, విజయనగరం నుంచి పూసపాటి అదితి, విశాఖపట్నం నార్త్ నుంచి పెనుమత్స విష్ణువర్ధన్ రాజు, చోడవరం నుంచి కలిదిండి రాజు బరిలో వున్నారు.

అనపర్తి శివకృష్ణంరాజు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు (దాదాపు 12 వేల క్షత్రియ సామాజిక వర్గ ఓట్లున్నాయి ఇక్కడ), ఉండి మంతెన రామరాజు (దాదాపు పది వేల ఓట్లు), ఉంగుటూరు పత్సమట్ల ధర్మరాజు (దాదాపు 12 వేల ఓట్లు), బాపట్ల వేగేశ్న నరేంద్ వర్మ తదితరులు ఎన్నికల బరిలో వున్నారు.

మొత్తంగా అన్ని పార్టీల నుంచి 11 నియోజకవర్గాల్లో 13 మంది అభ్యర్థులు క్షత్రియ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు చాలా తక్కువగా.. అంటే, 2,500 కంటే కూడా తక్కువే వున్నాయ్. అయినా, ఆయా నియోజకవర్గాల్లో క్షత్రియ సామాజిక వర్గానికి రాజకీయంగా పట్టుంది. ఆర్థికంగా బలంగా వున్న అభ్యర్థులనే కాదు, స్థానికంగా మంచి పేరు, పలుకుబడి కూడా కొందరు నేతలకు బాగా కలిసొస్తోంది.

ఒక్కో అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్‌లో చూపించే మొత్తం కంటే దాదాపు పది రెట్లు వాస్తవ ఆస్తులు కలిగి వున్నట్లుగా ఆయా నియోజకవర్గాల్లోనే ప్రజలు చర్చించుకుంటుండడం గమనార్హం. ఈ లెక్కన వందల కోట్లు, వేల కోట్ల ఆస్తులున్న అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ పడుతున్నారన్నమాట.

రఘురామకృష్ణరాజు లాంటోళ్ళయితే, పది మంది వరకూ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు సైతం భరించేలా రాజకీయాలు చేయగలిగే సత్తా వున్నోళ్ళే.

అందుకే, ప్రజాస్వామ్యంలోనూ రాజులున్నారన్న అభిప్రాయాలు తరచూ తెరపైకి వస్తుంటాయి. తమ స్టామినాకి ఇంకా రాజకీయాల్లో మెరుగైన గౌరవం దక్కాల్సి వుందని క్షత్రియ సామాజిక వర్గ నేతలు తరచూ వాదిస్తుంటారనుకోండి.. అది వేరే సంగతి.

743 COMMENTS

సినిమా

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్...

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను...

ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది....

పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టండి.. లక్ష్మీ మిట్టల్ ను...

దావోస్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అంశాలను వివరిస్తూ పెట్టుబడిదారులను...

‘గేమ్ ఛేంజర్’ సినిమాని విద్యార్థులకు చూపిస్తున్నారెందుకంటే.!

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ...

రాజకీయం

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా: చంద్రబాబు

నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడుతానంటూ చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు జాతి నిత్య స్ఫూర్తిని ఇస్తుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అన్నారు....

లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్‌కేంటి నష్టం.?

నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ కొందరు టీడీపీ నాయకులు, మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. సీఎం పవన్ కళ్యాణ్.. అని జనసేన శ్రేణులు హడావిడి చేస్తున్నాయి కదా.. ఇదీ...

వైసీపీకి చావు దెబ్బ: కీలక నేతలు గుడ్ బై.! కార్యకర్తలు లబోదిబో.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళారు.. వైసీపీకి ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన రవిచంద్రారెడ్డి (స్కైమాక్స్ రవి) రాజీనామా చేశారు. అంతేనా, వైసీపీ సొంత పత్రిక సాక్షిలో టీడీపీ ప్రకటన...

ఎక్కువ చదివినవి

ఈ నెల 29 నుంచి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ స్టార్ట్..!

జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న మూవీ మోస్ట్ వెయిటెడ్ లిస్ట్ లో టాప్ లో ఉంటుంది. మాస్ హీరోకు వైల్డ్ ఫైర్ లాంటి డైరెక్టర్ తగిలితే ఎలా ఉంటుందో ఈ సినిమాతో...

ఆకట్టుకుంటున్న కిరణ్ అబ్బవరం “దిల్ రూబా” ఫస్ట్ సింగిల్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా'. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రవి, జోజో జోస్,...

“ఒక్కడినే వస్తా..కూర్చుని మాట్లాడుకుందాం రా..”… మంచు మనోజ్ ట్వీట్ విష్ణు గురించేనా?

గత కొద్దిరోజులుగా మంచు కుటుంబం పేరు ఏదో ఒక వివాదంలో వినిపిస్తూనే ఉంది. కొంతకాలం కిందట ఆస్తుల పంపకాల్లో విభేదాల విషయమై మోహన్ బాబు, మనోజ్ ల మధ్య ఎంత వివాదం నడిచిందో...

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్ కు జైనబ్ రవ్జీల ఎంగేజ్ మెంట్...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 21 జనవరి 2025

పంచాంగం తేదీ 21-01-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:45 గంటలకు. తిథి: బహుళ సప్తమి ఉ 11.36 వరకు తదుపరి...