కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామానికి చెందిన ముల్పూరి రాంగోపాల్ మరియు అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ తోట నాగేంద్రబాబులు స్నేహితులు. కొన్ని రోజులుగా రాం గోపాల్ తన భార్యతో అక్రమ సంబంధంను పెట్టుకున్నట్లుగా నాగేంద్రబాబుకు అనుమానం వచ్చింది. ఆ విషయాన్ని అతడిని నేరుగా అడగకుండా కక్ష పెట్టుకున్నాడు.
ఆగస్టు 28వ తారీకున రాం గోపాల్ హైదరాబాద్ కు వెళ్తున్నట్లుగా చెప్పి బయలుజేరాడు. సెప్టెంబర్ 5వ తారీకు నుండి రాం గోపాల్ ఫోన్ పని చేయడం లేదు. దాంతో అతడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
పోలీసులు అతడి మొబైల్ ను ట్రాకింగ్ చేయగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాం గోపాల్ ఇంట్లో చెప్పినట్లుగా హైదరాబాద్ కు కాకుండా నాగేంద్ర బాబు లారీలో గుజరాత్ కు వెళ్లాడు. అక్కడ నుండి తిరుగు ప్రయాణంలో మార్బుల్స్ లోడుతో బొబ్బిలి వెళ్లారు. అక్కడ సరుకు దించి లారీ పక్కకు ఆపారు.
ఆ సమయంలో రాం గోపాల్ కు కాస్త ఎక్కువగా మద్యంను తాపించిన నాగేంద్రబాబు సోయి లేకుండా చేసి లారీ కింద పండబెట్టి తొక్కించేశాడు. ఈ కేసును విచారిస్తున్న సమయంలో రాం గోపాల్ మరియు నాగేంద్రలు క్లోజ్ అనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతడిని ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది.